close
Choose your channels

విజయేంద్ర ప్రసాద్ కథతో విష్ణు చిత్రం?

Sunday, February 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి. అతని విజయాల వెనకుండి నడిపిస్తున్న అదృశ్యవ్యక్తి ఆయ‌న తండ్రి విజయేంద్ర ప్రసాద్. దాదాపుగా రాజమౌళి సినిమాలన్నింటికీ కథలని అందించిన బ్లాక్ బస్టర్ కథా రచయిత ఈయ‌న‌. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల హీరోల సినిమాలకి కథలను అందించిన ఘనత ఈ రచయితది. అలాగే బ‌జరంగి భాయిజాన్` సినిమాకి కథని అందించి బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటారు.

అలాగే విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన‌ మెర్సల్`కి క‌థ‌ను అందించిన ఆయ‌న‌.. విజయ్ అప్ కమింగ్ మూవీకి కూడా కథను అందించ‌బోతున్నారు. ఇదిలా వుంటే...ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఫ్యామిలీకి ఈ ర‌చ‌యిత క‌థ‌ను అందించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు కోసం సామాజిక అంశం నేపథ్యంతో సాగే కథకి.. వాణిజ్య అంశాలను ముడిపెడుతూ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఓ క‌థ‌ని అందించారని స‌మాచారం. విష్ణుకి కూడా కథ నచ్చడంతో దీనిని సమర్థవంతంగా తెరకెక్కించే దర్శకుడి వేటలో పడ్డారని ఇండస్ట్రీ టాక్. అన్నీ కుదిరితే ఈ సినిమా ఈ ఏడాదే పట్టాలెక్కే అవ‌కాశ‌ముంది. ఇక విష్ణు నటించిన గాయత్రి` ఈ నెల 9న విడుదల కానుండగా..ఆచారి అమెరికా యాత్ర` త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.