'వెల్‌కం జింద‌గీ' టీజర్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Thursday,February 14 2019]

పిల్ల‌ర్ 9 ప్రొడ‌క్ష‌న్స్' బ్యానర్ పై శ్రీ‌నివాస క‌ళ్యాణ్ - ఖుష్బూ పోద్దార్ ల‌ను హీరో-హీరోయిన్‌లుగా ప‌రిచ‌యం చేస్తూ శాలు - ల‌క్ష్మ‌ణ్ ద‌ర్శ‌క‌త్వ లో రూపొందుతున్న చిత్రం 'వెల్‌కం జిందగీ'. చుట్టూ ఉన్న‌ ప‌దిమందికి సాయ‌ప‌డితే ఆ సాయం వారి జీవితాల్లో వెలుగులు నింపితే ఆ ఆనంద‌మే వేరు! అనేది కాన్సెప్ట్‌. సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టిజర్ ని ప్రముఖ దర్శకులు వి. వి వినాయక్ ప్రేమికుల దినొత్సవం సందర్బంగా విడుదల చేశారు.

అనంతరం వి.వి.వినాయక్ మాట్లాడుతూ టీజర్ బాగుంది. టీజర్ చూశాక సినిమాలో మంచి కంటెంట్ ఉందనిపిస్తుంది. టీమ్ కి నా శుభాకాంక్షలు. ఈ సినిమా బాగా ఆడాలని ఆశిస్తున్నా అన్నారు.

ద‌ర్శ‌కులు శాలు- ల‌క్ష్మ‌ణ్‌ మాట్లాడుతూ - ''ముందుగా మా టీజర్ ని విడుదల చేసి మమ్మల్ని ప్రోత్సహించిన సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మ‌నం చేసే చిన్న సాయం ఇత‌రుల జీవితాల్లో ఎలాంటి ఆనందాన్ని, వెలుగును నింపుతుందో చెబుతూ సాయం ప్రాముఖ్య‌త‌ను వివ‌రించే చిత్ర‌మే ఇది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ప్రేమ‌క‌థ ఆక‌ట్టుకుంటుంది. ఇదో ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. కొత్త‌వారే అయినా నాయ‌కానాయిక‌లు చ‌క్క‌గా న‌టించారు.

మ‌ధుమ‌ణి, క‌మ‌ల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. వారి న‌ట‌న సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. జ‌బ‌ర్ధ‌స్త్ ఫేం కొమురం హీరో స్నేహితుడుగా న‌టించాడు. త‌న కామెడీ ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. సినిమాటోగ్రాఫ‌ర్ శ్రీ‌సాయి ప్ర‌తి ఫ్రేమ్‌ను అందంగా తెర‌కెక్కించారు. 5 విభిన్న‌మైన‌ పాట‌లున్నాయి. గౌత‌మ్ ర‌విరామ్ సంగీతం అద్భుతంగా కుదిరింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. అని తెలిపారు. ఈ చిత్రానికి క‌థ‌-క‌థ‌నం -ద‌ర్శ‌కత్వం : శాలు- ల‌క్ష్మ‌ణ్

More News

'క‌థానాయ‌కుడు' న‌ష్టాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి

నందమూరి బాల‌కృష్ణ త‌న తండ్రి, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను రెండు భాగాలుగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

పార్టీ మారడానికి సిద్ధమైన టీడీపీ ఎంపీ!

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు జంపింగ్‌‌లు షురూ చేశారు. రోజురోజుకు ప్రతిపక్ష వైసీపీ, జనసేనకు నేతలు క్యూ కడుతున్నారు.

జయరామ్ హత్యకేసు: శిఖాకు ఊహించని వ్యక్తి మద్దతు!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలో ఎన్నారై చిగురుపాటి జయరామ్ ‌‌హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

స్క్రీనింగ్‌కు సేనాని గ్రీన్‌సిగ్నల్.. వడపోత కత్తిమీద సామే.!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడో,రేపో ఎన్నికల కోడ్ మొదలవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇవ్వడంతో పాటు, ప్రత్యేక హోదాపై ఢిల్లీలో పోరుబాట పట్టారు.

జగన్ సంచలన నిర్ణయం.. షర్మిళకు కీలక బాధ్యతలు!

వైఎస్ షర్మిళకు కీలక బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో పదిరోజుల్లో ఆమెకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారా..?