close
Choose your channels

ఇంట్లోనే కూర్చొని మీకు కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చు: డాక్టర్ సంధ్య

Saturday, June 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గత కొద్ది రోజులుగా మానవాళిని వణికిస్తున్న మహమ్మారి కరోనా. మొదట్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఈ మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కానీ ఇప్పుడు కరోనా ఉన్నవారూ.. లేనివారూ ఒకేలా కనిపిస్తున్నారు. ఎలాంటి లక్షణాలూ కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో మనం కరోనా టెస్టుల కోసం ఆసుపత్రుల వరకూ పరిగెత్తక్కర్లేదంటున్నారు డాక్టర్ సంధ్యా రామనాథన్. ఇంట్లో కూర్చొనే కరోనా ఉందో లేదో చెక్ చేసుకునే పద్ధతిని ఆమె ఓ వీడియో ద్వారా సూచించారు. దీనికి ఆమె పల్స్ ఆక్సిమీటర్ అనే పరికరాన్ని మనకు పరిచయం చేశారు.

మన శ్వాస ద్వారా కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చని సంధ్య పేర్కొన్నారు. పల్స్ ఆక్సిమీటర్ అనే చిన్న పరికరాన్ని ఆన్ చేసి దానిలో మన చూపుడు వేలు పెడితే.. మన రక్తంలో ఆక్సిజన్ లెవల్‌తో పాటు మన పల్స్ రేటును కూడా చెబుతుందని సంధ్య వెల్లడించారు. నార్మల్‌గా మన బ్లడ్‌లో ఆక్సీజన్ లెవల్ 95 - 100 ఉండాలని.. కానీ 93కంటే తక్కువకు పడిపోతే మనకు వైద్య సహాయం తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు. అయితే కరోనా రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ఆమె వీడియోలో వివరించారు. ఇమ్యూనిటీ సిస్టమ్‌ను పెంచుకోవడం ఎలా? మన డైట్‌లో ముఖ్యంగా ఏమేమి ఉండేలా చూసుకోవాలి? అలాగే కొన్ని బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను కూడా సంధ్య సూచించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.