close
Choose your channels

జగన్‌ మనసున్న మా రాజు.. కచ్చితంగా నిలదీస్తా!

Sunday, May 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జగన్‌ మనసున్న మా రాజు.. కచ్చితంగా నిలదీస్తా!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయ డంఖా మోగించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై పలువురు ప్రముఖులు సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మే-30న వైఎస్ జగన్.. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాగా ఈ సమయానికి ప్రమాణం చేయమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ముహూర్తం ఖరారు చేశారని మే-23న వార్తలు వచ్చాయి. కాగా.. ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరస్వతి.. జగన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తండ్రి కంటే బెటర్‌గా చేస్తారు!

"వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలువలు ఉన్న మనసున్న మారాజు. నిజాయితీ పరుడు.. అబద్దాలు ఆడటం తెలియదు. ఈ పేద సమాజానికి ఏదో మంచి చేయాలన్న కోరిక ఉన్న వ్యక్తి. జగన్ తన తండ్రి కంటే సమర్థవంతమైన పాలన అందిస్తారన్న నమ్మకం నాకుంది" అని స్వరూపానంద చెప్పుకొచ్చారు.

జగన్‌ను సైతం నిలదీస్తా..!

"నేను వ్యక్తిని ప్రేమించను.. వ్యవస్థను గౌరవిస్తాను. శారదా పీఠంకు వ్యక్తిగత పూజలు లేవు. చంద్రబాబు హయాంలో జరిగినట్లుగా దేవాలయాలను కూల్చి.. దేవాలయాల ఆస్తుల్ని పూర్తిగా కొల్లగొట్టి.. టీటీడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా కచ్చితంగా నిలదీస్తాను. శారదాపీఠాధిపతి ఎప్పుడూ మారడు.. నా ధోరణి మారదు. హిందూ సమాజాన్ని కూలుస్తుంటే శారదా పీఠం ఊరుకోదు.. అప్పుడు ప్రశ్నించాం.. ఇప్పుడు అలాగే ఉంటే ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తూనే ఉంటాం" అని ఆయన తేల్చిచెప్పారు.

వైఎస్ అంటే ప్రాణం..!

"వైఎస్ అంటే తనకు ప్రాణం. వైఎస్ ఆ రోజుల్లో నేనంటే చాలా ఇష్టం ఉండేది. వైఎస్ హయాంలో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టాక పేద ప్రజలకు చాలా దగ్గరయ్యారు. పిల్లల దగ్గర నుంచి నిరుద్యోగుల వరకు ఏదో చేయాలనే తపన ఉన్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి.. సమాజంలో నేను పూర్తిగా అంకితం అవ్వాలని కోరుకునే వ్యక్తి వైఎస్. ఈ సమాజంలో ఆయన పేరు మర్చిపోకూడదు.. వైఎస్‌కు ఎంత గుర్తింపు ఉందో.. జగన్‌ కూడా.. అంతకంటే ఎక్కువ గుర్తింపు ఉండాలనే కసి ఉన్న మనిషి. అటువంటి వ్యక్తి ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి కంటే ఇంకా గొప్పగా పరిపాలిస్తారు. పేదలకు సంక్షేమం అందించి.. గొప్ప నాయకుడిగా ఎదుగుతారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది" అని పీఠాధిపతి చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.