close
Choose your channels

మహేశ్ బాబుకు వైఎస్ జగన్ సాయం..!!

Thursday, January 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహేశ్ బాబుకు వైఎస్ జగన్ సాయం..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వీరాభిమానులకు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 11న అనగా ఎల్లుండి విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నిర్మాత అనిల్ సుంకర లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన ప్రభుత్వం.. అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక ప్రదర్శనలు వేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే ఆరు రోజుల పాటు స్పెషల్ షోలు వేసుకోవచ్చన్న మాట.

వాస్తవానికి మహేశ్ సినిమా అంటే ఫ్యాన్స్‌కు పూనకాలే.. అలాంటిది స్పెషల్ షోలు కూడా ఉంటాయంటే సంక్రాంతి పండుగ అభిమానులకు మూడ్రోజుల ముందే వచ్చేసినట్లే. ఈ ప్రత్యేక షోల వల్ల కాసుల వర్షం మరింత ఎక్కువగా కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తానికి చూస్తే మహేశ్ బాబుకు‌ పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డి సాయం చేస్తున్నారని వైసీపీ కమ్ సూపర్‌స్టార్ వీరాభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos