close
Choose your channels

'నేను శైలజ' ను డౌన్ లోడ్ చేస్తే 2 లక్షలు జరిమానా

Tuesday, January 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్త ఏడాది 'నేను శైలజ' విజయంతో శుభంగా ఆరంభమైంది. ఇక్కడ మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతూ విజయపథంలో దూసుకెళుతోంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్, కీర్తి సురేశ్ జంటగా కృష్ణచైతన్య సమర్పణలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా, విడుదలయ్యే ప్రతి సినిమా దాదాపు పైరసీకి గురవుతున్న విషయం తెలిసిందే. ఇక, హిట్ సినిమా అంటే పైరసీదారులు వదిలిపెడతారా? ప్రస్తుతం 'నేను శైలజ' విషయంలో అదే జరుగుతోంది. ఈ చిత్రం అనధికారిక కాపీని ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ చేసుకుని, చూస్తున్నారు. ఇది 'స్రవంతి మూవీస్' దృష్టికి వెళ్లడంతో చిత్రనిర్మాత రవికిశోర్ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆ విషయంలోకి వస్తే..

'నేను శైలజ్'ను డౌన్ లోడ్ చేస్తున్న వారి ఐపీ అడ్రస్ ను అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో తెలుసుకుని, వారి మీద తగిన చర్యలు తీసుకోనున్నారు. డౌన్ లోడ్ చేసుకుని చూసేవాళ్లకు 2 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని రవికిశోర్ తెలిపారు. పైరసీ చేసేవాళ్లను చట్టపరంగా ఎదుర్కొంటామనీ, వారికి కఠిన శిక్ష తప్పదనీ ఆయన స్పష్టం చేశారు. ఇంకా రవికిశోర్ మాట్లాడుతూ - ''అనధికారిక కాపీని డౌన్ లోడ్ చేసేవాళ్లకు ఐదు వేల నుంచి ఏడు వేల ఆస్ర్టేలియన్ డాలర్లు జరిమానా విధించవచ్చని 'డల్లాస్ మూవీ బయ్యర్స్ క్లబ్'కు ఇటీవల ఆస్ర్టేలియన్ కోర్టు అనుమతినిచ్చింది. పలు వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. యూస్ లో కూడా వార్నర్ బ్రదర్స్ సంస్థ డౌన్ లోడ్ చేస్తున్నవారికి 20 డాలర్లు జరిమానా విధిస్తోంది. భారతీయ చట్ట ప్రకారం రెండు లక్షల రూపాయలు జరిమానా విధించవచ్చు. ఈ నేపథ్యంలో 'నేను శైలజ'ను డౌన్ లోడ్ చేస్తున్నవారి ఐపీ అడ్రస్ లను సేకరిస్తున్నాం. అందరికీ చట్టపరంగా నోటీసులు పంపించనున్నాం'' అని చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.