close
Choose your channels

బండ్ల గణేష్ ఓతోడేలు - సచిన్ జోషి

Monday, March 27, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో, నిర్మాత అయిన స‌చిన్ జోషికి, మ‌రోనిర్మాత బండ్ల గ‌ణేష్‌కు మ‌ధ్య పెద్ద వార్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. వీడెవ‌డు సినిమా ప్రెస్‌మీట్‌లో నిర్మాత స‌చిన్ జోషి ఈ వివాదంపై స్పందించారు. స‌చిన్‌జోషి మాట్లాడుతూ బండ్ల‌గ‌ణేష్ నాకు న‌థింగ్‌. త‌న గురించి నేను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌నం రోడ్డులో వెళుతుంటే కుక్క‌లు మొరుగుతుంటాయి. అటువంటి కుక్క‌ల‌కు కూడా విశ్వాసం ఉంటాయి. కానీ బండ్ల గ‌ణేష్‌కు విశ్వాస‌మే లేదు. త‌న ఒక తోడేలు. ఈ స‌మ‌స్య‌ను అంద‌రి స‌మ‌క్షంలో ప‌రిశీలించుకోవాల‌నుకున్నాను.
అప్ప‌టికే బండ్ల‌గ‌ణేష్‌పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది. కానీ ఆ మీటింగ్‌లో బండ్ల గ‌ణేష్ తండ్రి చాలా పెద్దాయ‌న‌..క‌న్నీళ్ళు పెట్టుకున్నారు. అంత పెద్దాయ‌న నా కాళ్ళు ప‌ట్టుకోబోతుంటే నాకే చాలా బాధ వేసింది. ఆయ‌న్ను చూసి నేను లీగ‌ల్ యాక్ష‌న్స్ తీసుకోను, అయితే నా డ‌బ్బులు చెల్లించ‌మ‌ని అడిగాను. త‌ను రెండు నెల‌లు స‌మ‌యం కావాల‌ని అన్నాడు. ఆ స‌మ‌యం అడిగే రెండేళ్ళు అవుతుంది. త‌నపై 14 కేసులు పెట్టాను. త‌ను నాకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలుసు, వారు వీరు తెలుసునని అంటుంటాడు. కానీ త‌న‌కెవ‌రూ తెలియ‌దు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గొప్ప వ‌క్తి, అద్భుత‌మైన న‌టుడు. త‌న పేరును బండ్ల గ‌ణేష్ త‌ప్పుగా వాడేసుకుంటున్నారు. త‌ను త‌లా, తోక లేని మాట‌లు చెబుతుంటాడు. నేను రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వంటి నా మిత్రుల‌ను చూసి, సినిమాపై ప్యాష‌న్‌తో వారి కోసం సినిమాలు చేశానే త‌ప్ప బండ్ల గ‌ణేష్ కోసం సినిమాలు చేయ‌లేదు. త‌న‌పై న్యాయప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాను. ప్ర‌స్తుతం కేసు కోర్టు ప‌రిధిలో ఉంది. అందువ‌ల్ల నేనేం చెప్ప‌కూడ‌దు. కోర్టు కేసును ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని భావిస్తున్నానని స‌చిన్ జోషి తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.