close
Choose your channels

డబ్బింగ్ కార్యక్రమాల్లో సునీల్ - ఎన్.శంకర్ ల సినిమా

Friday, September 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

"జై బోలో తెలంగాణా" లాంటి యునానిమస్ హిట్ అనంతరం శంకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని డబ్బింగ్ కార్యక్రమాలు మొదలెట్టుకొంది. మలయాళ సూపర్ హిట్ సినిమా "2 కంట్రీస్"కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.

మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలను గూర్చి దర్శకనిర్మాత ఎన్.శంకర్ చెబుతూ.. "మలయాళంలో సూపర్ హిట్ అవ్వడమే కాక రికార్డ్ స్థాయిలో వసూళ్లు దక్కించుకొన్న "2 కంట్రీస్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. సునీల్ కి సరిగ్గా సరిపోయే రోల్ ఇది, సినిమా చాలా బాగా వచ్చింది. సరికొత్త సునీల్ ను ఈ సినిమాలో చూడబోతున్నారు. షూటింగ్ పూర్తయ్యింది, ఇవాళే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలెట్టాం. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి.. టైటిల్ ను కూడా ప్రకటిస్తాం" అన్నారు.

నరేష్, సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, పృధ్వీ, శ్రీనివాస్ రెడ్డి, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, డైలాగ్స్: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వెంకటరమణ, ప్రొడక్షన్ కంట్రోలర్: కర్రపాటి రమణ, నిర్మాణం-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్.శంకర్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.