close
Choose your channels

సీక్వెల్ కు సిద్ధమవుతున్న విశాల్...

Tuesday, November 10, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళ స్టార్ విశాల్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో విశాల్ సినిమాలు తమిళంతో పాటు, తెలుగులో కూడా విడుదలవుతున్నాయి. రీసెంట్ గా నడిగర్ సంఘం ఎన్నికల్లో సెక్రటరీగా ఎన్నికైన విశాల్ ఇప్పుడు తన సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఎప్పటి నుండో విశాల్ తన కెరీర్ ప్రారంభంలో సూపర్ హిట్ అయిన పందెం కోడి` చిత్రానికి సీక్వెల్ చేస్తానని అంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ సీక్వెల్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 2005లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఈ సీక్వెల్ కు కూడా లింగుస్వామి దర్శకత్వం చేయబోతున్నాడు. ఈ సినిమాలో రాజ్ కిరణ్, మీరా జాస్మిన్ తదితరులు నటిస్తారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారట. సినిమాను ఫిభ్రవరి నుండి స్టార్ట్ చేస్తారని కోలీవుడ్ సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.