2016 - వివాదాలు..!

2016 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఊహించని విజయాలు వచ్చాయి, ఘోరా పరాజయాలు వచ్చాయి. వీటితో పాటు అనుకోని వివాదాలు కూడా ఉన్నాయి. 2016కి గుడ్ బై చెబుతూ...2017కి స్వాగతం చెబుతున్న సందర్భంగా ఎవరు ఎవర్ని ఏమన్నారు..? ఆ వివాదాలు ఏమిటో మీరే చూడండి..!

బన్ని చెప్పను బ్రదర్ వివాదం..!

అల్లు అర్జున్ సరైనోడు సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతుంటే...ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని అరవడం...బన్ని నేను చెప్పను బ్రదర్ అనడంతో వివాదం మొదలైంది. అక్కడ నుంచి ట్విట్టర్ లో పవన్ ఫ్యాన్స్ బన్నికి వ్యతిరేకంగా చూసుకుంటాం బ్రదర్ అంటూ ట్వీట్స్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వివాదానికి ఫుల్ స్టాఫ్ పెట్టాలని నిర్ణయించుకుని బన్నితో ఒక మనసు ఆడియో ఫంక్షన్ లో మాట్లాడించారని వార్తలు వచ్చాయి. నిహారిక నటించిన ఒక మనసు ఆడియో వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ...వివరణ ఇవ్వడంతో వివాదం ముగిసింది.

వివాదస్పదమైన బాలయ్య మాటలు..!

నారా రోహిత్ నటించిన సావిత్రి ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ ఆడియో వేడుకలో బాలయ్య మాట్లాడుతూ...నేను ఎక్కని ఎత్తులు లేవు. చూడని లోతులు లేవు అన్నారు అంతే కాకుండా ముద్దు అన్నా పెట్టాలి కడుపు అన్నా చేయాలి అన్నారు. బాలయ్య మాట్లాడిన ఈ మాటలు వివాదస్పమయ్యాయి. ఒక ఎమ్మెల్యే అయి కూడా మహిళల గురించి బాలయ్య ఇలా మాట్లాడడం ఏమిటి అంటూ మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు ప్రశ్నించడంతో చివరికి బాలయ్య మహిళలకు సారీ చెప్పవలసి వచ్చింది.

ఫ్లాపోత్సవం కాంట్రవర్సీ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేక ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. అయితే...కొంత మంది దురాభిమానులు బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం...దీనిని ఓ ఆంగ్ల దిన పత్రిక ప్రచురిండంతో మహేష్ ఫ్యాన్స్ కు కోపం వచ్చింది. అంతే ఆ ఆంగ్లదిన పత్రిక పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో ఆ వార్త ప్రచురించినందుకు చింతిస్తున్నాం అంటూ సారీ చెబుతూ నెక్ట్స్ డే మరో ఆర్టికల్ ప్రచురించడంతో కాంట్రవర్సీ క్లియర్ అయ్యింది.

పవన్ - నాన్నకు ప్రేమతో వివాదం..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో... చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసారు. అయితే... రేపు నాన్నకు ప్రేమతో...సినిమా రిలీజ్ అనగా ఊహించని విధంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కంప్లైట్ చేయడం విశేషం. ఇంతకీ పవన్ ఎందుకు ఫిర్యాదు చేసారంటే..అత్తారింటికి దారేది సినిమా టైంలో పవన్ కి రెమ్యూనరేషన్ లో భాగంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ రెండు కోట్లు బాకీ ఉన్నారు. నాన్నకు ప్రేమతో...రిలీజ్ టైంలో ఇస్తానని పవన్ కి మాట ఇచ్చారట. అయితే బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ రెండు కోట్లు ఇవ్వకపోవడంతో అసోషియేషన్ లో ఫిర్యాదు చేసారు పవన్. ఫిర్యాదు స్వీకరించిన అసోసియేషన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఈ ఫిర్యాదును పంపించింది. ఆతర్వాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ వివాదాన్ని పరిష్కరించుకుని సినిమాని రిలీజ్ చేసారు.

బాలయ్య - చిరు వివాదం..!

ఆంధ్రప్రదేశ్ లో లేపాక్షి ఉత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. హిందూపూర్ లో జరిగిన లేపాక్షి ఉత్సవాలు తెలుగు ఇండస్ట్రీలో వివాదస్పమై హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే...ఈ ఉత్సవాలకు చిరంజీవిని ఆహ్వానించలేదు. ఇదే విషయం పై బాలయ్యను జర్నలిస్టులు ప్రశ్నించగా నేను ఎవర్నీ నెత్తి మీద పెట్టుకోను. నేను ఆహ్వానిస్తే రావడానికి రెడీగా చాలా మంది ఉంటారు కానీ ఎవర్నీ ఆహ్వానించాలో నాకు తెలుసు. నాది డిక్టేటర్ స్టైల్ అనడం హాట్ టాపిక్ గా నిలిచింది.

అల్లు అరవింద్ కాంట్రవర్సీ..!

మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాకి ఎక్కువ ధియేటర్స్ దొరకకుండా అల్లు అరవింద్ అడ్డుపడుతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ సరైనోడు సినిమాను ఎక్కువ ధియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు అల్లు అరవింద్ ఈవిధంగా బ్రహ్మోత్సవంకు థియేటర్స్ దొరకకుండా ప్రాబ్లమ్ క్రియేట్ చేసారంటూ ప్రచారం జరగడం వివాదస్పమైంది.

త్రివిక్రమ్ అ ఆ వివాదం..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అ ఆ సినిమా మీనా సినిమా స్పూర్తితో రూపొందింది. అ ఆ రిలీజ్ తర్వాత ఈ సినిమా మీనా సినిమాకి కాపీ అంటూ వార్తలు రావడంతో అ ఆ వివాదస్పమైంది. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ వివరణ ఇస్తూ...మీనా సినిమా యుద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా టైటిల్స్ లో యుద్దనపూడి సులోచన గార్కి థ్యాంక్స్ చెబుతూ పేరు వేయాలి అనుకున్నాం కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వలన కుదరలేదు. ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్ క్లియర్ చేసి యుద్దనపూడి గారి పేరు వేసాం ఇంకా ఎవరైనా దీనిని వివాదస్పదం చేయాలి అనుకుంటే మీ ఇష్టం. ఈ వివరణతో వివాదం ముగిసింది అనుకుంటున్నాను అని త్రివిక్రమ్ అనడంతో ఈ క్రాంటవర్సీ ఫుల్ స్టాఫ్ పడింది.

రేష్మి - మెగా ఫ్యాన్స్ వివాదం..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ కలెక్షన్స్ విషయమై చరణ్ ఫ్యాన్స్ కి యాంకర్ రేష్మికి మధ్య సోషల్ మీడియాలో వార్ నడిచింది. ఇంతకీ ఏం జరిగింది అంటే...ఎవరో ఓ వ్యక్తి రేష్మి నటించిన గుంటూరు టాకీస్ విజయవాడలో ఫస్ట్ డే 17 లక్షలు వసూలు చేసింది. రామ్ చరణ్ ధృవ విజయవాడలో ఫస్ట్ డే 14 లక్షలు వసూలు చేసింది అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ను రేష్మి రీట్వీట్ చేస్తూ ఫన్ గా తీసుకున్నాను అంది. రేష్మి రీట్వీట్ పై చరణ్ ఫ్యాన్ ఫైర్ అవుతూ ఎవడో దురాభిమాని ట్వీట్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నావా అని రేష్మిని ప్రశ్నించాడు. దీనికి రేష్మి స్పందిస్తూ...ఏది జోక్ గా తీసుకోవాలో నాకు తెలుసు నా ఇష్టం అంటూ కాస్త ఘాటుగానే సమాధానం చెప్పింది. చరణ్ ఫ్యాన్స్ రేష్మి మధ్య వార్ ఇంతటితో ఆగలేదు. నాన్ కమ్మ హీరోలను తక్కువుగా చూస్తున్నావ్ అని చరణ్ ఫ్యాన్ అంటే...కులాల గురించి చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో చదువుకున్నాను. కులాల గురించి మాట్లాడుతున్నావ్ మనం ఏ కాలంలో ఉన్నాం. మాకు పని ఉంది బాధ్యత ఉంది దీనిని ఇక్కడితో ఆపితే మంచిది అని చెప్పడం జరిగింది. ఈవిధంగా రేష్మి - మెగా ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ లో జరిగిన వార్ వివాదస్పమైంది..!

పవన్ ఫ్యాన్ వినోద్ రాయల్ హత్య..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురవ్వడం వివాదస్పమైంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ...చంపుకునేంత స్ధాయిలో అభిమానం ఉండకూడదు. నిందుతులను కఠినంగా శిక్షించాలి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసారు. అయితే...పవన్ ఫ్యాన్ వినోద్ పై దాడి చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్ అక్షయ్ అని ప్రచారం జరిగింది. అసలు...చంపుకునేంతగా ఏం జరిగింది అంటే....ఓ సేవా కార్యక్రమానికి వెళ్లిన వీళ్లు మా హీరో గొప్ప అంటే...మా హీరో గొప్ప అంటూ వాదించుకున్నారట. ఆఖరికి పవన్ ఫ్యాన్ ఎన్టీఆర్ కి బ్లాక్ బష్టర్ వచ్చి పదేళ్లు అయ్యింది అనడంతో ఎన్టీఆర్ ఫ్యాన్ కోపం ఆపుకోలేక పవన్ ఫ్యాన్ వినోద్ పై దాడి చేసాడు అంటూ ప్రచారం జరిగింది.

జనతా గ్యారేజ్ - మాటీవీ కాంట్రవర్సీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బష్టర్ మూవీ జనతా గ్యారేజ్. ఈ చిత్రం రికార్డ్ స్ధాయిలో దాదాపు 80 కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అయితే...ఈ సినిమా ఇంకా ధియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగానే ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ మా టీవీ జనతా గ్యారేజ్ చిత్రాన్ని ప్రసారం చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. థియేటర్స్ లో జనతా గ్యారేజ్ సినిమా రన్ అవుతున్న టైమ్ లో మా టీవీ ప్రసారం చేయడం కరెక్ట్ కాదు అంటూ మా టీవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవ్వడం వివాదస్పమైంది.

నవదీప్ రేవ్ పార్టీ వివాదం..!

నవదీప్ తో పాటు కొంత మంది సినీ నటులు పార్టీ చేసుకోవడం...అది పోలీసులకు తెలియడం..మీడియాలో వార్తలు రావడం వివాదస్పమైంది. ఈ వార్తల పై నవదీప్ స్పందిస్తూ...ఎలాగో వీడి మీద చాలా ఉన్నాయి కదా..! ఇంకొకటి వేసేద్దాం జనాలు నమ్ముతారు...ఆనందిస్తారు. టి.ఆర్ పి వస్తుంది అనుకుంటున్నారు అంటూ నవదీప్ మీడియా పై చేసిన కామెంట్స్ వివాదస్పమయ్యాయి. వాస్తవాలు తెలుసుకుని వార్తలు ప్రసారం చేయండి అంతే కానీ మీ టి.ఆర్.పి రేటింగ్స్ కోసం ఇలా చేయద్దు అంటూ నవదీప్ కామెంట్ చేసారు.

30 ఇయర్స్ పృథ్వీ - బాలయ్య ఫ్యాన్స్ కాంట్రవర్సీ..!

30 ఇయర్స్ పృథ్వీ బాలయ్యలా పేరడీ చేయడం కాంట్రవర్సీ అయ్యింది. బాలయ్య ఫ్యాన్స్ పృధ్వీ చేసే పేరడితో బాగా హర్ట్ అయ్యారు. దీంతో పృధ్వీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ జగన్ తో మాట్లాడి పృధ్వీ ఇక నుంచి బాలయ్య గురించి పేరడీ చేయను అనడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

ఎన్టీఆర్ - కోలీవుడ్ డైరెక్టర్ వివాదం

ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని సింగం 3 ఫేమ్ హరితో చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే...ఇదే విషయాన్ని డైరెక్టర్ హరిని ఓ ఇంటర్ వ్యూలో అడిగితే...ఎన్టీఆర్ ఎవరో నాకు తెలీదు. ఇప్పటి వరకు ఆయన్ని కలవలేదు అని చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఆతర్వాత ఈ వార్తల పై హరిని వివరణ అడిగితే...నేను అలా అనలేదు. అలాంటిది ఎలా ఈ వార్త వచ్చిందో తెలియడం లేదు. ఎన్టీఆర్ అంటే నాకు అభిమానం. టెంపర్ సినిమాని చాలా సార్లు చూసాను. నాకిష్టమైన హీరో గురించి ఇలా ఎలా మాట్లాడతాను అంటూ వివరణ ఇచ్చారు.

పూరి డిస్ట్రిబ్యూటర్స్ కాంట్రవర్సీ..!

పూరి జగన్నాథ్ కి, లోఫర్ చిత్రాన్ని పంపిణి చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఏం జరిగింది అంటే.. లోఫర్ వలన నష్టం పోయాం అంటూ నష్ట పరిహారంగా కొంత మొత్తాన్ని ఇవ్వాలని పూరి పై డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి తేవడంతో పూరి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆతర్వాత డిస్ట్రిబ్యూటర్స్ పూరి పై డబ్బులు ఇవ్వాలి అంటూ ఒత్తిడి చేయలేదు అనడంతో వివాదం మరింత పెద్దదైంది. ఆఖరికి నిర్మాత సి.కళ్యాణ్ జోక్యంతో ఈ వివాదాం ముగిసింది.

వంగవీటి వివాదం..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వంగవీటి. ఈ చిత్రంలో వంగవీటి రంగా గురించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి అంటూ వంగవీటి రాథా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతే కాకుండా వర్మకి వంగవీటి రాధా వార్నింగ్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో వర్మ కూడా ఏమాత్రం తగ్గకుండా.... పని పాట లేకుండా మురికి వీధుల్లో తిరిగే మీ లాంటి వాళ్ళు రాధా రంగాల పేరుని చెడగొట్టటానికే పుట్టారు. మీలాంటి కుయ్యం గాళ్ళు నా దిష్టి బొమ్మల్ని తగలబెట్టచ్చు గాని నేను మీ లోపలి కుళ్ళుని పెట్రోల్ కూడా లేకుండా తగలబెడతా. ఇప్పటికైనా బుద్ధిలేని మీ బుర్రల్లోకి బుద్ది తెచ్చుకోకపోతే నా అంతు చూసే లోపల మీరే అంతమైపోతారు. నేను క్షమాపణలు చెప్పటం అటుంచి మీరు మొరగడం ఆపకపోతే మీ అసలు జాతేంటో అందరికీ తెలిసిపోతుంది...ఖబర్దార్ అంటూ వర్మ వార్నింగ్ ఇచ్చారు.

బాహుబలి 2 విజువల్స్ లీక్..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే...బాహుబలి 2 సినిమాకి సంబంధించిన 10 నిమిషాల విజువల్స్ లీక్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ను టెక్నికల్ టీమ్ లోని వారే లీక్ చేసారని తెలిసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి లీక్ చేసిన వారిని పట్టుకున్నారు.

వి.ఎన్.ఆదిత్య - ఆంగ్లదినపత్రిక వివాదం..!

దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఫ్యామిలీని పట్టించుకోవడం మానేసి విదేశాల్లో ఉంటున్నాడు అంటూ ప్రముఖ ఆంగ్లదిన పత్రిక వార్తను ప్రచురించింది. ఈ వార్త రాసిన జర్నలిస్ట్ పై వి.ఎన్.ఆదిత్య తనైదన శైలిలో ఫైర్ అవ్వడం వివాదస్పమైంది. ఆతర్వాత ఆ జర్నలిస్ట్ పోలీసులను ఆశ్రయించడంతో వివాదం ముగిసింది.

ఖైదీ నెం 150 వివాదం..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ తెరకెక్కించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖైదీ నెం 150 తమిళ చిత్రం కత్తి కి రీమేక్ గా రూపొందిన విషయం తెలిసిందే. అయితే... కత్తి కథ తనదని తనకు న్యాయం చేయాలి అంటూ రచయిత నరసింహరావు రచయితల సంఘంకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కత్తి తెలుగు రీమేక్ ఖైదీ నెం 150 ప్రారంభోత్సవానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆఖరికి రచయిత నరసింహరావుకు న్యాయం చేసి ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. ఆతర్వాతే ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

2016 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఊహించని విజయాలు వచ్చాయి, ఘోరా పరాజయాలు వచ్చాయి. వీటితో పాటు అనుకోని వివాదాలు కూడా ఉన్నాయి. 2016కి గుడ్ బై చెబుతూ...2017కి స్వాగతం చెబుతున్న సందర్భంగా ఎవరు ఎవర్ని ఏమన్నారు..? ఆ వివాదాలు ఏమిటో మీరే చూడండి..!