మారుతీరావుకు బెయిల్.. సుప్రీంకోర్టుకు అమృత
Send us your feedback to audioarticles@vaarta.com
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందుతుడితో మిగిలిన వారందరికీ బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన తండ్రికి, బాబాయ్కు బెయిల్ రావడంతో ప్రణయ్ కుటుంబీకులు.. ముఖ్యంగా మారుతీరావు కుమార్తె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడిన అమృత.. భారత దేశ న్యాయవ్యవస్థ తీరు సరిగా లేదని ఆమె తప్పుబట్టారు.! పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన వారిపై పీడీ యాక్ట్ కొట్టివేసి బెయిల్పై విడుదల చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇష్టం లేకపోవతే వదిలేయండి..!
నిందితులు బయటకు రావడం వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉందని..ఈ వ్యవహారంపై హైకోర్టుకు అప్పీలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అమృత, ప్రణయ్ కుటుంబీకులు మీడియాకు వివరించారు. ఈ కేసులో 7 నెలలకే బెయిలు వస్తుందనుకోలేదన్నారు. బెయిలు ఇవ్వడం అంటే మారుతిరావు లాంటి వారిని ప్రోత్సహించినట్టుగా ఉందన్నారు. కోర్టులు పరువు హత్య కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయపడింది. మారుతిరావు మా కుటుంబానికి హాని చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేమ వివాహాలు తల్లిదండ్రులకు ఇష్టం లేక పోతే పిల్లలను వదిలేయండి అంతేకానీ చంపొద్దని అమృత విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. మారుతీరావుకు బెయిల్ వచ్చినప్పటికీ ఆయన కఠిన శిక్ష పడుతుందని తాము నమ్ముతున్నామని ప్రణయ్ తండ్రి చెప్పుకొచ్చారు.
రక్షణ కల్పిస్తాం.. సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎస్పీ రంగనాథ్
నిందితులకు బెయిల్ రావడంతో ఎస్పీ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిందితుల బారి నుంచి ప్రణయ్ కుటుంబ సభ్యులకు ఎటువంటి ముప్పు కలగకుండా రక్షణ కల్పిస్తామని తెలిపారు. అయితే నిందితులకు బెయిల్ లభించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ సర్కార్ తరఫున తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. నిందితులకు బెయిల్ రాకుండా పీడియాక్ట్ అమలు చేశామని ఈ సందర్భంగా ఎస్పీ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.