close
Choose your channels

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ మాస్టర్‌మైండ్‌ చంద్రబాబే.. నిగ్గుతేల్చిన సీఐడీ..

Saturday, February 17, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ మాస్టర్‌మైండ్‌ చంద్రబాబే.. నిగ్గుతేల్చిన సీఐడీ..

ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాస్టర్ మైండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు ఇది రుజువైంది. కాకపోతే ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చిన బాబును వైసీపీ ప్రభుత్వం ఆధారాలతో సహా పట్టేసింది. తన అస్మదీయులకు యథేచ్ఛగా ప్రభుత్వ ప్రాజెక్టులు కట్టబెట్టి వేరే మార్గాల ద్వారా లబ్ధి పొందడంలో చంద్రబాబుకు సాటి ఎవరూ లేరు. తనకు సన్నిహితుడు, నేరచరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టును కట్టబెట్టినట్లు సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఏ1గా చంద్రబాబు..

ఇందులో ఏ1గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌, ఇన్‌క్యాప్‌ సంస్థలకు అప్పటి ఎండీ కోగంంటి సాంబశివరావు( ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా ఉన్నారు)లతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక‌్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్‌ విత్‌ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక‌్షన్లు 13(2), రెడ్‌ విత్‌ 13(1)(సి)(డి) ప్రకారం కేసు నమోదు చేసింది. ఫైబర్‌నెట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందని తన చార్జ్‌షీట్‌లో సవివరంగా వివరించింది.

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ మాస్టర్‌మైండ్‌ చంద్రబాబే.. నిగ్గుతేల్చిన సీఐడీ..

లోకేశ్‌కు సన్నిహితుడైన వ్యక్తికి..

టెరాసాఫ్ట్‌ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్‌నెట్‌ ప్రాజెక్ట్‌ను కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. మొత్తం రూ.2వేల కోట్ల ఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన "టెరాసాఫ్ట్‌' కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు సీఐడీ.. ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కాం జరిగిందని ఏపీ సీఐడీ చార్జ్ షీట్లో వివరిచింది. ఈ ప్రాజెక్ట్‌ను ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా.. విద్యుత్‌, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖల ద్వారా నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపింది. ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించేవారని వెల్లడించింది.

నిబంధనలకు విరుద్ధంగా..

వేమూరి హరికృష్ణని నిబంధనలకు విరుద్దంగా ఫైబర్‌నెట్ కార్పొరేషన్ డైరెక్టర్‎గా నియమించారని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు తన సన్నిహితుడైన హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని చంద్రబాబు ముందే నిర్ణయించుకుని కథ నడిపినట్లు ఛార్జీషీట్‌లో పేర్కొంది. విధి విధానాలు పాటించకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‎కు చంద్రబాబు అనుమతులు ఇచ్చారని స్పష్టంచేసింది. ఈ ప్రాజెక్ట్‎ను వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి ఇచ్చేలా ప్రాజెక్ట్ అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని చెప్పింది. టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో హరి ప్రసాద్‎ను నియమించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది.

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ మాస్టర్‌మైండ్‌ చంద్రబాబే.. నిగ్గుతేల్చిన సీఐడీ..

బ్లాక్‌లిస్ట్‌లో టెరాసాఫ్ట్ కంపెనీ..

ఇక ప్రాజెక్ట్‌ విలువను కూడా అడ్డగోలుగా నిర్ణయించారని సీఐడీ అధికారులు తెలిపారు. ఎలాంటి మార్కెట్‌ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్ట్‌ కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్‌ విలువను అమాంతంగా పెంచేశారన్నారు. వేమూరి హరికృష్ణ, ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌ టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్‌ కంపెనీ ప్రభుత్వ బ్లాక్‌ లిస్ట్‌లో ఉందన్నారు. పౌర సరఫరాల శాఖకు ఈపోస్‌ యంత్రాల సరఫరాలో విఫలమైన ఆ కంపెనీని ప్రభుత్వం బ్లాక్‌ లిస్టులో పెట్టిందని గుర్తు చేశారు.

అధికారిని బదిలీ చేసి మరీ..

కానీ చంద్రబాబు ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టు నుంచి ఏకపక్షంగా తొలగించారని.. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టేశారని ఆరోపించారు. దీనిపై పేస్‌ పవర్‌ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సం‍స్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి మరీ టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారని తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి టెండర్ ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చూస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారన్నారు. స్కాం ద్వారా కొల్లగొట్టిన నగదును షెల్ కంపెనీల ద్వారా సొంత ఖాతాలకు మళ్లించారని వెల్లడించారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించింది..

ఇక ప్రాజెక్ట్‌ను అమలుచేయడంలో కూడా టెరాసాఫ్ట్‌ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. టెండర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదని.. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయన్నారు. మరోవైపు షెల్‌ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారని.. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారని చెప్పారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారని తెలిపారు.

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ మాస్టర్‌మైండ్‌ చంద్రబాబే.. నిగ్గుతేల్చిన సీఐడీ..

షెల్ కంపెనీల ద్వారా నగదు తరలింపు..

వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే మ్యాన్‌పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీని సృష్టించారని పేర్కొన్నారు. ఆ కంపెనీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు అన్నారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసిందని ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. నకిలీ ఇన్వాయిస్‌లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారని.. వాటిలో రూ.144 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా తరలించారని.. ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చారు.

కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ..

ఫైబర్‌నెట్‌ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ముందుగా ఇండిపెండెంట్‌ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్‌ ద్వారా ఆడిటింగ్‌ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్‌ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్‌ నిర్ధారించింది. ఫైబర్‌ నెట్‌ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలంగా వ్యవహరించారని సెక‌్షన్‌ 164 సీఆర్‌పీసీ ప్రకారం న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఏసిబి కోర్టు, ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‎ను తిరస్కరించిందని.. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సీఐడీ తన ఛార్జ్ షీట్‎లో పొందుపరిచింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment
Related Videos