'కథానాయకుడు' నష్టాలను భర్తీ చేయడానికి
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ను రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి తొలి భాగం `యన్.టి.ఆర్ కథానాయకుడు` విడుదలైంది. ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. విడుదలకు ముందు ఉన్న క్రేజ్తో బయ్యర్లు సినిమాను భారీ రేట్లు పెట్టి కొన్నారు. అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి నష్టాల్నే మిగిల్చింది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా రెండో భాగం `యన్.టి.ఆర్ మహానాయకుడు`ని విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ సతమతమైయ్యారు.
ఓదధశలో కథానాయకుడు కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్కు మహానాయకుడు ఫ్రీ అని కూడా అన్నారు. అయితే తర్వాత లెక్కలు మారాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా ఉండటానికి బాలయ్య స్వయంగా రంగంలోకి దిగారు. కథానాయకుడు కొన్నవారికి నష్టాల్లో మూడో వంతు ఇచ్చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే మహానాయకుడు చిత్రాన్ని అదే కోనుగోలు దారులకు అప్పగించారు. ఈ సినిమా లాభాల్లో 40 శాతం డిస్ట్రిబ్యూటర్స్కే ఇస్తామని కూడా తెలియజేశారు. `యన్.టి.ఆర్ మహానాయకుడు` చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.