close
Choose your channels

రసూల్ పురా ‘మెట్రో’ పైకప్పు పెచ్చులూడిందా!

Monday, September 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైదరాబాద్‌లోని అమీర్ పేట మెట్రో రైల్వేస్టేషన్ ఆవరణలో పైకప్పు పెచ్చులూడిన ఘటనలో మౌనిక అనే మహిళ మృతి చెందిన అనంతరం అన్నీ అనుమానాలే వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన చోటుచేసుకున్న అనంతరం ప్రయాణికులు, హైదరాబాదీలు మెట్రోలో ప్రయాణించాలంటే గజగజ వణుకుతున్నారు. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన ఎల్అండ్‌టీ అధికారులు ఇంకా ఎక్కడెక్కడ ఇలా పెచ్చులు ఊడాయో అని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఇదిలా ఉంటే.. ఈ ఘటన మరువకముందే మరో మెట్రో స్టేషన్ పైకప్పు పరిస్థితి ఇదేమాదిరి ఉందని తెలుస్తోంది. రసూల్ పురా మెట్రోస్టేషన్ పైకప్పు పెచ్చులూడే దశలో ఉంది. దీంతో అటు.. అటుగా వెళ్లాలన్నా.. రావాలన్నా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ విషయంపై మెట్రో అధికారులు స్పందించి తక్షణం చర్యలు చేపట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఆదివారం నాడు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఘోరం జరిగిన సంగతి తెలిసిందే. మెట్రో పిల్లర్ పెచ్చులు ఊడి మౌనికపై నేరుగా తల మీద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.