నవ్యాంధ్రలో చంద్రబాబుకు కొత్త ఇళ్లు దొరికిందోచ్..!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో ఇప్పటికే అమరావతిలోని ఉండవల్లిలో ఉండే ప్రజావేదికను అధికారులు కుప్పకూల్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వేదిక పక్కనే ఉండే చంద్రబాబు నివాసం సైతం అక్రమంగా కట్టిందేనని.. దాన్ని కూడా త్వరలో కూల్చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ తరుణంలో ముందే ఇళ్లు ఖాళీ చేయాలని బాబు కుటుంబ సభ్యులు భావిస్తు్న్నారట. మరోవైపు నవ్యాంధ్రలో ఎక్కడ టూ లెట్ బోర్డు ఉందా..? అని చంద్రబాబు అన్వేషిస్తున్నారట.
బాబుకు కొత్తిల్లు దొరికింది!
బుధవారం నాడు జరిగిన నేతల భేటీలో కరకట్టపై ఉన్న నివాసంలో ఉండాలా..? లేకుంటే ఇళ్లు చేయాలా..? అనే అంశంపై అభిప్రాయాలను తీసుకున్న చంద్రబాబు వీలైనంత త్వరలోనే ఇళ్లు చేయాలని భావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక వేళ ఇళ్లు మారాల్సి వస్తే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని నేతలకు చంద్రబాబు సూచించారట. మరోవైపు ఉద్దండరాయునిపాలెంలో ఇల్లు ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని నేతలు చంద్రబాబుతో చెప్పారని టాక్.. తనకు అనువైన నివాసం దొరికిన వెంటనే ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని బాబు భావిస్తున్నారట.
ముందే ఖాళీ..!
ఇదిలా ఉంటే.. చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేనని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. దాన్ని కూడా కూల్చివేయక తప్పదని.. త్వరలోనే ఆ ప్రక్రియ మొదలుపెడతమని.. ఆ రకంగా చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాలనే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో చంద్రబాబు ముందే ఇళ్లు చేయించాలని భావిస్తున్నారట. మరోవైపు నది పరివాహక ప్రాంతంలో ఏ అక్రమ కట్టడమూ ఉండనిచ్చేది లేదని కూల్చివేతే మార్గం అని జగన్ తేల్చిచెప్పేసిన విషయం విదితమే. అయితే మున్ముంథు మరెన్ని అక్రమ కట్టడాలను కూల్చేస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.