పుట్టిన రోజు చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేడు 69వ పడిలోకి అడుగుపెట్టారు. బాబు జన్మదిన వేడుకలు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, వైఎస్ జగన్, కేటీఆర్తో పాటు పలువురు ప్రముఖులు విషెస్ తెలిపారు. ఈ బర్త్త్ డే నాడు చంద్రబాబు ట్విట్టర్ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మొదటి ట్వీట్..
"ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం. ఇన్ని సంవత్సరాలలో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ నా శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి నన్ను కార్య సాధనకు మరింత ప్రేరేపించాయన్నది నిజం" అని బాబు చెప్పుకొచ్చారు.
రెండో ట్వీట్..
"మన రాష్ట్రానికి మన ప్రజలకూ కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఈ యజ్ఞంలో భాగస్వాములే. రాష్ట్రం కోసం, దేశం కోసం , ప్రజాస్వామ్యం కోసం మనం ఎలుగెత్తిన గళం ఈ తరాల కోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం కూడా." అని బాబు తెలిపారు.
మూడో ట్వీట్..
"ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా చూడాలన్న నా లక్ష్య సాధనలో భాగస్వాములుగా నిలిచిన ప్రజలు, ఆధికారులు, ఉద్యోగులు, మేధావులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నా జన్మదినాన్ని గుర్తుంచుకొని అభినందనలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని చంద్రబాబు చెప్పారు.
#NaraChandrababuNaidu has on Saturday celebrated his birthday with his family members. Seen in the pics are the #AndhraPradesh chief minister and others in a joyful mood. The #TDP supremo was greeted by actor #Nara Rohit, among others, personally.@ncbn @naralokesh pic.twitter.com/IczxnWm1K8
— IndiaGlitz™ l Telugu (@igtelugu) April 20, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.