close
Choose your channels

Sharmila:జగన్‌ పాలన కన్నా చంద్రబాబు పాలనే బెటర్.. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల ఫైర్..

Thursday, February 22, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో సెకట్రేరియట్‌' కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) బయటకు రాకుండా విజయవాడలోని కాంగ్రెస్ పోలీసులు భారీగా చుట్టుముట్టారు. మరోవైపు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. దీంతో పార్టీ అభిమానుల నినాదాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసుల తీరుతో ఆఫీసులోనే షర్మిల సహా ఇతర నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

"23వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 23వేలు ఖాళీగా ఉన్నప్పుడు 7వేల ఉద్యోగాలే ఎందుకు వేస్తున్నారని అప్పుడు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మీరు 6వేల ఉద్యోగాలే ఎందుకు వేశారు. మరి మీ కంటే చంద్రబాబు నాయుడే మేలు కదా. మీ కంటే చంద్రబాబు నాయుడే ఎక్కువ ఉద్యోగాలిచ్చారు. ఆయన కంటే ఘోరం అని మిమ్మల్ని మీరే నిరూపించారు. మాట తప్పం..మడమ తిప్పం అన్నవారు..ఇప్పుడు మాటను మడతపెట్టారు. రాజశేఖర్ రెడ్డి వారసత్వమంటే ఇదేనా? వైఎస్ జగన్ సమాధానం చెప్పాలి. మీరు సీఎం అయినప్పుడు 2 లక్షల 30వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి అందులో ఎన్ని భర్తీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. 30వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి" అని విమర్శించారు షర్మిల.

"ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఏటా 500 మంది డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు చనిపోతున్నారు. బతుకు మీద ఆశలేకే.. వారంతా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలని విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఇక్కడ లేదా? ఇదేమైనా ఆఫ్ఘనిస్తానా? మీరేమైనా తాలిబాన్లా..? అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అలాగే 'వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్ట్ చేస్తున్నారు. 23 వేల పోస్టుల భర్తీ అని చెప్పి.. కేవలం 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం, అరెస్టులపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాదిగా వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు.? పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పార్టీ కార్యాలయంలోనే గడపాలా.? నాకు ఈ పరిస్థితి రావడం మీకు అవమానం కాదా.? మేము తీవ్ర వాదులమా.? సంఘ విద్రోహ శక్తులమా.? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మీరు భయపడుతున్నట్లే. మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించిన నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగదు'అని హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment