close
Choose your channels

చ‌ర‌ణ్ - సుకుమార్ మూవీ అప్ డేట్స్..!

Friday, November 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ధృవ డిసెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్ సుకుమార్ తో మూవీ చేయ‌నున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే...చ‌ర‌ణ్ తో సుకుమార్ ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థను తెర‌కెక్కించాలి అనుకుంటున్నాడ‌ట‌.

అది కూడా 1980 - 1990 మ‌ధ్య జ‌రిగే ప్రేమ‌క‌థ‌. తూర్పుగోదావ‌రి జిల్లాలోని ఓ ప‌ల్లెటూరులో జ‌రిగే ఈ ప్రేమ‌క‌థ‌ను అక్క‌డే చిత్రీక‌రించాలి అనుకున్నా...అభిమానులు ఎక్కువుగా ఉండే అక్క‌డ షూటింగ్ చేయ‌డం కుద‌ర‌దు. అందుచేత ఆర్ట్ డైరెక్ట‌ర్ తోట త‌ర‌ణి తో ఓ ప‌ల్లెటూరు సెట్ ను వేయించ‌నున్నారు. ఇక ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ను సెలెక్ట్ చేయ‌లేదు. ఇటీవ‌ల రాశీఖ‌న్నాతో ఫోటో షూట్ చేసార‌ట‌. త్వ‌ర‌లోనే హీరోయిన్ ను ఫైన‌ల్ చేయ‌నున్నారు. త్వ‌ర‌లో పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభించి జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.