మెగాభిమాని మృతితో చలించిపోయిన చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ హీరోలకు అభిమానులే బలం అన్న విషయం తెలిసిందే. సినిమా హిట్ చేయడంలో.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవాలన్నా అభిమానులదే కీలక పాత్ర అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.! అందుకే అభిమానులను కొందరు హీరోలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఇక మెగా హీరోల గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అభిమానులకు కష్టమొచ్చిందంటే చాలు తమకు తోచినంతగా సాయం చేస్తూ ఆదుకుంటుంటారు మెగా హీరోలు. అలా మెగాహీరోలను అభిమానించే హైదరాబాద్కు చెందిన వీరాభిమాని నూర్ మహ్మద్ ఆదివారం నాడు మృతి చెందాడు. మెగా హీరోలంటే ఈయనకు అమితాభిమానం.. మరీ ముఖ్యంగా చిరు అంటే ఆయనకు ప్రాణం.
అలాంటి వీరాభిమాని చనిపోయాడని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు మెగా హీరోలు చలించిపోయారు. వెంటనే నూర్ నివాసానికి వెళ్లిన మెగా హీరోలు... ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూర్ కుటుంబ సభ్యులను ఓదార్చిన మీకు అన్ని విధాలా అండగా ఉంటామని అభయమిచ్చారు. నూర్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ఉన్నారు.
నేను అండగా ఉంటా..!
కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం చిరు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.‘ నూర్ మహ్మద్ నాకు వీరాభిమాని. ఆయన మరణం తీరని లోటు. తోటి అభిమానులందరికీ బాధాకరమైన సంఘటన. ఆయన్ని తిరిగి తీసుకొని రాలేను కానీ.. వారి కుటుంబానికి అండగా ఉంటాను’ అని మెగాస్టార్ అభయమిచ్చారు.
మరోవైపు.. మెగా హీరోలు ఈ మృతిపై సోషల్ మీడియా వేదికగా స్పందించి.. ఆయన లేరంటే చాలా బాధ కలుగుతోందని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. గీతా ఆర్ట్స్ స్పందిస్తూ.. తమ కుటుంబంలో ఒకరుగా భావించే నూర్ చనిపోవడం ఎంతో కలచివేసిందని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. కాగా.. నూర్ గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన మృతితో తెలుగు రాష్ట్రాల్లోని మెగాభిమానులు విషాదంలో మునిగిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.