close
Choose your channels

Mahender Reddy :కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు

Friday, February 9, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మరో వారం రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వికారాబాద్ జెడ్పీ ఛైర్మన్‌గా ఉన్న సునీతారెడ్డి చేవెళ్ల ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతోనే రేవంత్‌ రెడ్డిని కలసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ నుంచి తాండూర్ ఎమ్మెల్యేగా పైలట్ రోహిత్‌రెడ్డి గెలిచారు. అయితే ఎన్నికల అనంతరం ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి కేసీఆర్.. టికెట్ ఇవ్వడంతో మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే కేసీఆర్ కలుగజేసుకుని మంత్రి పదవి ఇవ్వడంతో పార్టీలోనే ఉండిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు వికారాబాద్‌ జిల్లాలోని 4 నియోజకవర్గాలు హస్తం పార్టీ గెలుచుకుంది. దీంతో పట్నం దంపతులు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న, సీనియర్‌ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్‌ తదితరులు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు.

సీనియర్ నేత అయిన పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనుండటం వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే ఆయన సోదరడు నరేందర్ రెడ్డి మాత్రం గులాబీ పార్టీలోనే ఉండనున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సామెత ఉంది. ఒకప్పుడు బద్ధ శత్రువుగా ఉన్న నేతలు కూడా అవసరాల దృష్ట్యా మిత్రులుగా మారిపోతారు. ఈ సామెత ప్రస్తుతం చక్కగా సరిపోతుంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఓటమే ధ్యేయంగా పట్నం మహేందర్‌రెడ్డి పనిచేశారు. తన సోదరుడు నరేందర్‌రెడ్డిని రేవంత్‌పై పోటీకి దింపి తొలిసారి ఆయన నియోజకవర్గంలోనే ఓడించారు. ఆ తర్వాత రేవంత్ మల్కాజ్‌గిరి ఎంపీగా గెలవడం, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేయడం తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment