close
Choose your channels

250 కబాలి టికెట్లు కొన్న హీరో....

Friday, July 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి ప్ర‌పంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజైంది. కామ‌న్ మేన్ నుంచి సెల‌బ్రెటీస్ వ‌ర‌కు అంతా క‌బాలి జ‌పం చేసారు. దీని అంత‌టికి కార‌ణం తెలిసిందే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా రిలీజ్ కానంత‌గా భారీ స్ధాయిలో క‌బాలి రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే...250 క‌బాలి టికెట్లును ఓ హీరో కొన్నారు.
ఇంత‌కీ ఆ హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? త‌మిళ హీరో శింబు. ర‌జ‌నీకాంత్ కి శింబు వీరాభిమాని. ప్ర‌స్తుతం శింబు అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ మ‌ధురైలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. శింబు త‌న చిత్ర యూనిట్ స‌భ్యుల కోసం 250 టికెట్లు కొన్నాడు. త‌న యూనిట్ స‌భ్యుల‌తో క‌లిసి శింబు క‌బాలి చిత్రాన్నిచూడ‌డం విశేషం. ఈ విధంగా ఒక్కొక్క‌రు ఒక్కొలా ర‌జ‌నీ పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.