close
Choose your channels

అయోధ్యలో హై అలెర్ట్.. ఉగ్రదాడికి కుట్ర!

Wednesday, July 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆగస్ట్ 5న భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఇటుకను ప్రధాని మోదీ అందించనున్నారు. దీనికోసం ఇటుకను ఇప్పటికే సిద్ధం చేశారు. 22.600 గ్రాముల వెండితో ఈ ఇటుకను తయారు చేశారు. 5వ తేదీన 12:15 గంటలకు ముహూర్తం కూడా ఖరారైంది. మరోవైపు ఈ వేడుకను భగ్నం చేసి.. వేడుకలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో హైఅలెర్ట్ ప్రకటించాయి. ఇంటింటా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయోధ్య ప్రాంతమంతా డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. కాగా.. జమ్మూకశ్మీర్‌కి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన రోజు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయనున్న రోజు ఒకటే కావడం గమనార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.