close
Choose your channels

దుర్గమ్మ సాక్షిగా గుడి ప్రాంగణంలో అపచారం..

Tuesday, May 5, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దుర్గమ్మ సాక్షిగా గుడి ప్రాంగణంలో అపచారం..

కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మకు చెంతకు ప్రతి రోజూ వేలాది మంది వెళ్లి దర్శించుకుంటూ ఉంటారు. అమ్మను ఏ కోరిక కోరినా తప్పుకుండా నెరవేస్తారనే భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాంటిది ఈ మధ్య వరుసగా అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. అప్పట్లో చీరలు మిస్ అవ్వడం.. ఆ తర్వాత అర్ధరాత్రి క్షుద్రపూజలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలే ఉన్నాయి. ఈ ఘటనలపై ఎంక్వయిరీ వేయడం.. సస్పెండ్ చేయడం లాంటివి చేయడం చేశారు.

అసలేం జరిగిందంటే...

ఇదిలా ఉంటే.. దుర్గమ్మ సాక్షిగా అమ్మవారి ప్రాంగణంలో అపచారం జరిగింది. దుర్గగుడి ఈవో సురేష్ బాబు ప్రాంగణంలో షూ వేసుకునే నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఆయన పక్కనే ఉన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ పైలా సోమినీడు తో పాటు మిగిలిన అందరూ పాదరక్షాలు లేకుండా ఉన్నప్పటికీ ఈవో మాత్రం అలా షూతో ఉండటం గమనార్హం. అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు చూసిన జనాలు, భక్తులు విస్తుపోతున్నారు. సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజా పరిణామంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.