close
Choose your channels

చంద్రయాన్-2 సక్సెస్.. సత్తా చాటిన భారత్

Monday, July 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యావత్ ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న ‘చంద్రయాన్‌-2’ ఎట్టకేలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది. సోమవారం మధ్యాహ్నం అనుకున్న టైమ్‌కు సరిగ్గా 2: 43 గంటలకు శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్‌-3ఎం1 రాకెట్‌ ద్వారా రివ్వున ఎగిరి జాబిల్లి వైపు దూసుకెళ్లింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ సత్తాను చాటిందని చెప్పుకోవచ్చు. ఈ గ్రాండ్ సక్సెస్‌తో అగ్రదేశాలకు దీటుగా జాబిల్లిపై ఏముందో కనుగొనేందుకు క్రమంలో మరో అడుగులేసినట్లైంది.

కాగా.. ఈ చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా జీఎస్ఎల్వీ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను తనతో పాటు నింగిపైకి మోసుకెళ్లింది. రాకెట్ బరువు 640 టన్నులు కాగా.. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్- కాంపోజిట్ మాడ్యూల్‌తో రాకెట్ నింగిలోకి పయనించింది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-2 మాడ్యూల్ విడిపోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగానికి మొత్తం రూ. 978 కోట్లు ఖర్చయిందని షార్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగం ఇదివరకే జరగాల్సి ఉండగా కొన్ని అనివార్యకారణాల నిలిచిపోయింది.

ఇదిలా ఉంటే ఈ ప్రయోగం సక్సెస్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.