close
Choose your channels

Janasena : తూర్పు , కోనసీమ జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర.. పవన్‌కు అభిమానుల ఘనస్వాగతం

Saturday, July 16, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘‘కౌలు రైతు భరోసా యాత్ర’’ను చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్రలు నిర్వహించి.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. తద్వారా వారి పిల్లల చదువులకు అండగా వుండేలా జనసేన ప్రణాళికలు రూపొందించింది. తాజాగా శనివారం తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న దాదాపు 60 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ చెక్కులు అందించనున్నారు.

పవన్ కోసం వర్షాన్ని లెక్కచేయకుండా తరలివచ్చిన అభిమానులు:

ఇందుకోసం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వీర మహిళలు, జనసైనికుల రాకతో మధురపూడి విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అభిమానులు పోటెత్తారు. తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు.

#GoodMorningCMSir క్యాంపెయిన్‌కు మంచి రెస్పాన్స్:

ఇకపోతే... ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల దుస్ధితిని తెలుపుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేల్కొలుపుతామంటూ #GoodMorningCMSir పేరిట జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి గుంతలు పడిన ఫోటోలు, వీడియోలను ప్రజలు, జనసేన నేతలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.