close
Choose your channels

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు..: కేసీఆర్

Saturday, April 11, 2020 • తెలుగు Comments
KCR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు..: కేసీఆర్

తెలంగాణలో ఏప్రిల్-30 వరకు లాక్‌డౌన్ కొనసాగింపు ఉంటుందని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. శనివారం నాడు సాయంత్రం సుమారు నాలుగున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు చర్చించారు. అనంతరం మీడియా ముందుకు వచ్చారాయన. ప్రజలందరూ దయచేసి సహకరించాలని ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. ఏప్రిల్-30 తర్వాత దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని మరోసారి కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ విషయాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడిగించాలనే కోరారు. కాగా.. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నామని.. పదో తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.

కేసుల లెక్క ఇదీ..

‘మనకు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు  34 మంది.. వాళ్లు, వాళ్ల ద్వారా సంక్రమించిన మరికొంతమంది వందశాతం డిశ్చార్జ్ అయ్యారు. తొలి దశలో వచ్చినవారంతా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది చనిపోగా.. 96 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 393 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మర్కజ్‌ నుంచి వచ్చిన 1200 మందిని గుర్తించాం’ అని కేసీఆర్ తెలిపారు.

భగవంతుని దయవల్ల..

‘ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ సిరియస్‌గా లేదు. ఆక్సిజన్, వెంటిలేటర్ పెట్టే పరిస్థితి లేదు. భగవంతుని దయవల్ల ఏప్రిల్-24 వరకు ఈ బ్యాచ్ క్లోజ్ అయ్యే ఆస్కారం ఉంది. ఆస్పత్రుల్లో ఉండేవాళ్లు.. క్వారంటైన్ వాళ్లు అందరూ రిలీజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త ఉప్పెన, ఉత్పాతం రాకపోతే చాలా వరకు మనం బయటపడినవాళ్లం అవుతాం. వ్యాధి ప్రబలకుండా నిరోధించే చర్యలు ప్రజలు సహకరిస్తున్నారు. హైదరాబాద్‌లో 243 చోట్ల నిరోధించే చర్యలు చేపట్టాం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

 
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.