జనసేనకు షాక్.. కీలక నేత రాజీనామా
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
2019 ఎన్నికల ముందు జనసేనకు షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలని కమిటీలు, కార్యదర్శులు, అభ్యర్థులను ప్రకటిస్తూ సంచలనం రేపుతున్న పవన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జనసేనాని ప్రకటించిన కమిటీల్లో ఒక సామాజిక వర్గానికి చోటు కల్పించారని.. మాకు కనీసం న్యాయం చేయలేదని తీవ్ర ఆవేదనకు లోనైన జనసేన ఏలూరు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మత్తే బాబి రాజీనామా చేశారు. తన సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బాబి ప్రకటించారు. రాజీనామా అనంతరం మత్తే మాట్లాడుతూ.. పవన్ తనకు కులం, మంతం లేదని చెబుతూనే కమిటీల్లో సమన్యాయం చేయకుండా ఒక వర్గానికే న్యాయం చేశారని మాటల్లో తప్ప చేతల్లో ఆయన చేసిందేమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా.. జనసేన స్థాపించిన నాటి నుంచి ఏలూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి సాయశక్తులా కృషి చేశారని ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నారు. అయితే తాజాగా జరిగిన కమిటీల్లో తమకు న్యాయం జరగలేదని తీవ్ర మనస్తాపానికి గురైన మత్తే రాజీనామా చేసి బయటికొచ్చేశారని అభిమానులు మీడియాకు వివరించారు. అయితే బాబీ ఏ పార్టీలో చేరతారు..? అనే విషయం తెలియరాలేదు. మిత్రులు, అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి వారి ఆకాంక్ష మేరకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా జనసేన నుంచి పలువురు ప్రముఖులు పార్టీకి గుడ్ బై చెబుతున్న వార్తలు వస్తున్న విషయం విదితమే. అయితే త్వరలోనే మరికొందరు బాబీ బాటలోనే నడుస్తారని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.