close
Choose your channels

తదుప‌రి చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన కొర‌టాల‌..!

Saturday, August 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కించిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ చేస్తుంది. ఈ చిత్రం త‌ర్వాత బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్టర్ కొర‌టాల‌ శివ మ‌హేష్ తో సినిమా చేయ‌నున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే...ఈరోజు మీడియాతో మాట్లాడిన కొర‌టాల శివ త‌న త‌దుప‌రి చిత్రం మ‌హేష్ బాబుతో చేయ‌నున్న‌ట్టు క‌న్ ఫ‌ర్మ్ చేసారు. ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌నున్నారు. డిసెంబ‌ర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం అని తెలియ‌చేసారు. సో...శ్రీమంతుడు కాంబినేష‌న్ లో సినిమా ఏరేంజ్ లో ఉంటుందో చూడాలి..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.