close
Choose your channels

ఆసుపత్రిలో కేటీఆర్ తనయుడు.. అసలేం జరిగిందంటే..!

Thursday, October 1, 2020 • తెలుగు Comments
KTR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆసుపత్రిలో కేటీఆర్ తనయుడు.. అసలేం జరిగిందంటే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా హుషారుగా ఉండే హిమాన్షు పలు మార్లు వార్తల్లో నిలిచాడు. అయితే తాజాగా హిమాన్షు కాలికి గాయమవడంతో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. తన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోవడంతో హిమాన్షుకి కాలికి బలమైన గాయాలు అయినట్టు సమాచారం. అయితే కనీసం నిలబడే పరిస్థితి కూడా లేకపోవడంతో పాటు విపరీతమైన నొప్పితో హిమాన్షు బాధపడినట్టు తెలుస్తోంది.

దీంతో హిమాన్షును హుటాహుటిన బుధవారం రాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. ఆసుపత్రి హిమాన్షుని తరలించిన వెంటనే ఆసుపత్రి వైద్యులు సీటీ స్కాన్ చేయించారని సమాచారం. ఈ స్కానింగ్‌లో తుంటి భాగం, మోకాలికి తీవ్రగాయం అయినట్లు వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది. హుటాహుటిన వైద్యులు హిమాన్షుకి వైద్యం ప్రారంభించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.