close
Choose your channels

11 గంటలకు ‘జూమ్’ ద్వారా మీటింగ్: వరవరరావు కుటుంబం

Sunday, July 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

11 గంటలకు ‘జూమ్’ ద్వారా మీటింగ్: వరవరరావు కుటుంబం

విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు కుటుంబం ప్రజలను మీటింగ్‌కు ఆహ్వానిస్తోంది. కరోనా మార్గదర్శకాలను అనుసరిస్తూ జూమ్ యాప్ ద్వారా చర్చను నిర్వహించనున్నట్టు తెలిపింది. నేటి ఉదయం 11 గంటలకు మీటింగ్ ప్రారంభమవుతుందని.. టాపిక్ ‘‘వీవీ హెల్త్ ప్రెస్ కాన్ఫరెన్స్’ అని తెలిపింది. అయితే ఇటీవల ఆయన కుమార్తెలు.. పి.సహజ, పి.అనల, పి.పవన తన తండ్రి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్‌కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశారు. మహారాష్ట్రలోని తలోజా జైల్లో కరోనా తీవ్రంగా వ్యాపించిందని వార్తలొచ్చాయని కాబట్టి 80 ఏళ్ళ వృద్దుడైన తమ తండ్రి ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.