మోదీ.. నాది యూటర్న్ కాదు.. భయపడను!
Send us your feedback to audioarticles@vaarta.com
గుంటూరు జిల్లా ఏటుకూరులో జరిగిన ‘ప్రజా చైతన్య సభ’ లో ప్రధాని మోదీ ప్రసంగించి.. సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబుకు.. మోదీ సూటి ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీ వ్యాఖ్యలకు చంద్రబాబు ఘాటు కౌంటరిచ్చారు. "యూటర్న్ తీసుకున్నానని నన్ను మోదీ విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేశారనే బాధతోనే ఎన్డీయే నుంచి బయటకు వచ్చాము.
నాది యూటర్న్ కాదని ఏపీ కోసం తీసుకున్న రైట్ టర్న్. కేవలం నన్ను తిట్టడం కోసం ఢిల్లీ నుంచి పెద్ద విమానం వేసుకుని ఏపీకి మోదీ వచ్చారు. ఏపీకి మోదీ తీరని అన్యాయం చేశారు. ఎదుటి వ్యక్తిని తిట్టడం చాలా సులువు. పని చేయడం కష్టం. విభజన కారణంగా అయిన పుండుపై మోదీ కారం చల్లుతున్నారు. మీరు చేసిన దారుణం సహించలేకే ఆంధ్రులంతా రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు" అని మోదీకి చంద్రబాబుకు ఘాటు కౌంటరిచ్చారు.
నేనేం భయపడను!
గుజరాత్లో ఊచకోత తర్వాత మోదీ మారాడని భావించి పొత్తు పెట్టుకున్నానని.. కానీ నమ్మించి మోసం చేశారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి అది ఇచ్చాం..ఇది ఇచ్చామని చెబుతున్న మోదీ.. అసలు ఏమిచ్చారో చెప్పాలి అని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు. మోదీ నాకు భయం లేదు. సీబీఐ కేసులున్న జగన్ భయపడతారు. రాజధానికి, పోలవరంకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు. తెలంగాణకు డబ్బులు ఇచ్చారు. మనం ఊడిగం చేయడం లేదని మనకు ఇవ్వడం లేదు. మోదీ చేసిన నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య" అని మోదీని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.