నాగ్ అశ్విన్ `లస్ట్ స్టోరీస్`
Send us your feedback to audioarticles@vaarta.com
హిందీలో విజయవంతమైన లస్ట్ స్టోరీస్ తరహాలో ఓ తెలుగులో లస్ట్స్టోరీస్ వెబ్ సిరీస్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రోనీ స్క్రూనీవాలా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ను నలుగురు దర్శకులు నాలుగు భాగాలుగా చిత్రీకరించనున్నారట. అందులో ఈషారెబ్బా నటించిన భాగాన్ని ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కించాడు. ఇప్పటికే నందిని రెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, అమలాపాల్ ప్రధాన పాత్రధారులుగా నటించిన భాగాన్ని తెరకెక్కించారు. మూడో పార్ట్ని తరుణ్ భాస్కర్ చిత్రీకరించాల్సి ఉంది. ఇది కాకుండా నాలుగో భాగాన్ని సందీప్ వంగా డైరెక్ట్ చేస్తాడని అనుకున్నారు.
అయితే ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీంతో ఈ పార్ట్ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. షాకింగ్ విషయమేమంటే ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం వెలువడనుంది. అంతా పూర్తయిన తర్వాత నెట్ఫ్లిక్స్లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. ఇలాంటి వెబ్సిరీస్ను తెలుగులో తెరకెక్కించడమంటే సాహసం చేస్తున్నట్లే మరి తెలుగు ప్రేక్షకులు ఈ తెలుగు లస్ట్ స్టోరీస్ను ఎలా ఆదరిస్తారో వేచి చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.