ఓటమి పై నారా లోకేశ్ స్పందన..
Send us your feedback to audioarticles@vaarta.com
గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేశ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ఓట్లు మాత్రం రాలకపోవడంతో నైరాశ్యంలో పడ్డారు. అంతేకాదు.. చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అట్టర్ ప్లాప్ అయ్యారు. రాజకీయ ఉద్ధండులుగా చెప్పుకున్న నేతలు సైతం 'ఫ్యాన్' స్పీడ్కు తట్టుకోలేకపోయారు.
ఓటమిపై లోకేశ్ స్పందన...
తన ఓటమిపై నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. " శాసనసభ అభ్యర్థిగా నేను పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇవేవీ ప్రజాసేవకు ఆటంకం కావు. ఇక ముందు కూడా ప్రజల్లోనే ఉంటాను. ప్రజల కోసం పనిచేస్తాను" అని లోకేశ్ ట్వీట్ చేశారు.
జగన్కు శుభాకాంక్షలు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు... "గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెలుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ నరేంద్ర మోదీ, వైఎస్ జగన్లకు శుభాకాంక్షలు" అని లోకేశ్ ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.