close
Choose your channels

Omicron BF 7 Variant : భారత్‌లోకి ప్రవేశించిన బీఎఫ్. 7 వేరియంట్ ... అప్పుడే నాలుగు కేసులు, కేంద్రం అలర్ట్

Wednesday, December 21, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుతం చైనాలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. జీరో కోవిడ్ పాలసీకి సంబంధించిన నిబంధనలు ఎత్తివేసిన తర్వాత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అక్కడ ఈ స్థాయిలో కేసుల విస్పోటనానికి ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంటే కారణం. ప్రస్తుతం ఈ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్‌కు చెందిన ఓ ఎన్ఆర్ఐ మహిళకు కరోనా టెస్ట్ చేయగా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. అలాగే ఒడిశాకు చెందిన మరో వ్యక్తికి కూడా ఇదే వేరియంట్‌ నిర్థారణ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు అనుమానితులను అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు.

కేంద్రం అప్రమత్తం :

భారత్‌లో ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కలకలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో హై అలర్ట్ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని వెల్లడించింది. అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది.

అసలేంటీ బీఎఫ్.7 వేరియంట్ :

ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.5కి చెందిన సబ్ వేరియంటే బీఎఫ్.7. దీనికి బలమైన ఇన్‌ఫెక్షన్ కలిగించే సామర్ధ్యం కూడా వుంది. దీని ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇన్‌ఫెక్షన్ కలిగించే గుణం ఈ వేరియంట్‌కు వుందట. చైనాతో పాటు అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర దేశాల్లోనూ బీఎఫ్ 7 వేరియంట్ వ్యాప్తి చెందుతోందట. ప్రస్తుతం భారత్‌లోనూ ఈ వేరియంట్ అడుగుపెట్టిన నేపథ్యంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.