close
Choose your channels

పోసానికి ఆపరేషన్.. వైసీపీ నేతల పరామర్శ

Sunday, June 2, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోసానికి ఆపరేషన్.. వైసీపీ నేతల పరామర్శ

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజకీయ విమర్శకుడు పోసాని కృష్ణ మురళి కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత రెండ్రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన అత్యవసర చికిత్స తీసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయనకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో.. ఇటీవలే పోసాని ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కొన్ని రోజుల పాటు.. విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. పోసాని పూర్తిగా కోలుకోవడానికి ఇంకా ఒక నెలరోజులు సమయం పడుతుందని తెలుస్తోంది.

పోసాని ఆపరేషన్ చేయించుకున్నారని తెలుసుకున్న అభిమానులు, అనుచరులు, వైసీపీ నేతలు, సినీ నటులు ఆయన్ను చూడటానికి క్యూ కట్టారు. ఇప్పటికే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, కమెడియన్ పృథ్వీతో పాటు పలువురు నేతలు, సినీ ప్రముఖులు వెళ్లి ఆయన్ను పరామర్శించి.. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.