close
Choose your channels

డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: మార్చి 11న రాధేశ్యామ్.. స్వయంగా ప్రకటించిన ప్రభాస్

Wednesday, February 2, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: మార్చి 11న రాధేశ్యామ్.. స్వయంగా ప్రకటించిన ప్రభాస్

ఆర్ఆర్ఆర్‌ రిలీజ్ విషయంలో క్లారిటీ రావడంతో టాలీవుడ్‌లో పెద్ద కదలిక వచ్చింది. చిన్నా, పెద్దా సినిమాలు ఒకదాని వెంట మరొకటి కొత్త డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఇకపోతే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్‌తో పాటే రిలీజ్ కావాల్సిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘‘రాధేశ్యామ్’’ సైతం విడుదల తేదీపై స్పష్టమైన ప్రకటన చేసింది. మార్చి 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రభాస్ బుధవారం స్వయంగా వెల్లడించారు. ‘‘విధిరాతకు, ప్రేమకు మధ్య జరగబోయే భారీ యుద్ధాన్ని మార్చి 11న థియేటర్లలో చూడండి... ఆ రోజు థియేటర్లలో కలుద్దాం" అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: మార్చి 11న రాధేశ్యామ్.. స్వయంగా ప్రకటించిన ప్రభాస్

సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావాల్సిన రాధేశ్యామ్.. దేశంలో కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఢిల్లీలో థియేటర్లు క్లోజ్ చేయడం, మహారాష్ట్రలో సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే షోలు వేయడానికి అనుమతులు ఇవ్వడం, తమిళనాడులో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతించడంతో రాధేశ్యామ్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది.

డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: మార్చి 11న రాధేశ్యామ్.. స్వయంగా ప్రకటించిన ప్రభాస్

పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా ‘రాధే శ్యామ్’ సినిమాను రూపొందించారు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ సినిమాను నిర్మించగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇందులో విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడి పాత్ర పోషించారు ప్ర‌భాస్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.