close
Choose your channels

లోక్‌సభ స్పీకర్, హోంశాఖ సెక్రటరీని కలవనున్న రఘురామ కృష్ణంరాజు

Friday, June 26, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లోక్‌సభ స్పీకర్, హోంశాఖ సెక్రటరీని కలవనున్న రఘురామ కృష్ణంరాజు

ఏపీలో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తమ పార్టీ నేతలపైనే కయ్యానికి కాలు దువ్వారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వ్యవహారం వెళ్లడంతో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. తనకు జారీ అయిన షోకాజ్ నోటీసుపై కూడా రఘురామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో సమాధానమిచ్చారు. రఘురామ కృష్ణంరాజు ప్రశ్నలనే సమాధానంగా సంధించడం విశేషం. దీంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఆయన నేడు ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు హోంశాఖ సెక్రటరీ అజయ్‌భల్లాను కలవనున్నట్టు తెలుస్తోంది. తనకు ప్రాణ హాని ఉందని.. కాబట్టి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరనున్నట్టు తెలుస్తోంది. అలాగే వైసీపీలో క్రమశిక్షణాసంఘం వ్యవహారంపై కూడా రఘురామ కృష్ణంరాజు ఈసీని కలవనున్నట్టు సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.