close
Choose your channels

29 మందికే వారలా చేస్తే.. 151 మంది ఉన్న మేమేం చెయ్యాలి: రోజా

Friday, June 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

29 మందికే వారలా చేస్తే.. 151 మంది ఉన్న మేమేం చెయ్యాలి: రోజా

టీడీపీ శాసనమండలిలో వాపును చూసి బలుపు అనుకుంటోందని.. 29 మంది ఉంటేనే వారలా చేస్తే.. 151 మంది ఉన్న తామెలా చెయ్యాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆమె టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ మెజార్టీ ఉన్నప్పుడు క్యాష్‌ని.. లేనప్పుడు క్యాస్ట్‌ని చూస్తుందని విమర్శించారు.

బలం లేకపోయినా టీడీపీ కాండిడేట్‌ను పెట్టిందని రోజా విమర్శించారు. దళితులకు రాజ్యసభ సీటు కేటాయించకపోవడంపై సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. తమ పార్టీ నుంచి 25 మంది దళితులు గెలిస్తే వారిలో ఐదుగురికి మంత్రి పదవులు కేటాయించారని వెల్లడించారు. కరోనా కట్టడికి జగన్ శ్రమిస్తున్నారని.. ప్రతి ఒక్కరికీ ప్రీగా టెస్టులు చేయిస్తున్నారని రోజా కొనియాడారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.