రానా ‘విరాటపర్వం’ స్టోరీ లీక్ అయిందా ?
Send us your feedback to audioarticles@vaarta.com
దగ్గుబాటి రానా, సాయి పల్లవి నటీనటులుగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే లాంచనంగా షూటింగ్ ప్రారంభమైంది. కాగా.. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది.
స్టోరీ ఇదేనట..
విరాపటర్వంలో సాయి పల్లవి రిపోర్టర్గా కనిపించనుందట. రానా నక్సలైట్గా కనిపించనున్నాడట. ఒకానొక సందర్భంలో సాయిపల్లవి.. రానాను ఇంటర్వ్యూ చేస్తుందట. ఆ ఒక్క ఇంటర్వ్యూతోనే రానా ఆమె ప్రేమలో పడి నక్సలిజాన్ని వదిలేస్తాడట. ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసి మొదట వార్డ్ మెంబర్గా గెలుస్తాడట. అలా ఈ ఇద్దరి మధ్య మరింత గ్యాప్ తగ్గుతుందట. అలా.. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను దర్శకుడు సహజ సిద్ధంగా చూపిస్తాడడని సమాచారం. అంతేకాదు.. బాలీవుడ్ హీరోయిన్ జరీనా వాహబ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
అయితే.. ఈ స్టోరీ లీకైనట్లు వస్తున్న వార్తలపై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి. కాగా.. ఎస్ఎల్వీ సినిమాస్.. సురేష్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా ‘విరాటపర్వం’ను నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ మూవీలో ప్రియమణి, టబు, మురళీ శర్మ, నానా పటేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.