సామ్కి చైతు బోర్ కొట్టేశాడట...
- IndiaGlitz, [Monday,March 18 2019]
రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ భార్యభర్తలుగా మారిన అక్కినేని నాగచైతన్య, సమంతలు ఓ కార్యక్రమంలో వారి వైవాహిక బంధం గురించి మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు టాపిక్గా మారుతున్నాయి. చైతు, సామ్ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుని అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు.
పెళ్లి అయిన తొలి ఏడాది చాలా ఎగ్జయిట్మెంట్ ఉండేదని.. ఇప్పుడు రొటీన్ అయ్యిందని చైతు చెప్పాడు. అంతే కాకుండా సమంతను ట్రాక్ చేస్తున్నానని కూడా చెప్పాడు.
దీనికి సమాధానంగా చైతన్య బోరింగ్ పర్సన్ అని సమంత సెటైర్ వేసింది.. ఇలా వీరిద్దరి సంభాషణ సరదాగా సాగిందట. ఈ ఇద్దరూ పెళ్లి తర్వాత భార్యభర్తలుగా కలిసి నటిస్తోన్న తొలి చిత్రం 'మజిలీ' ఏప్రిల్ 5న విడుదలవుతుంది.