ఆది సాయికుమార్, వేదిక జంటగా ద్విభాషా చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆది సాయికుమార్, వేదిక హీరో హీరోయిన్లుగా తెలుగు, తమిళ బై లింగ్వుల్ చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. కార్తీక్ విఘ్నేశ్ దర్శకుడు. హీరోయిన్ వేదిక నటిస్తున్న నాలుగో తెలుగు చిత్రమిది. మార్చి 25 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చిత్తూరు జిల్లాలోని తలకోనలో ప్రారంభం కానుంది.
రోబో, 2.0 చిత్రాలకు అసోసియేట్ కెమెరామెన్గా పనిచేసిన గౌతమ్ జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సి.సత్య సంగీతాన్ని అందిస్తున్నారు.
'అర్జున్ సురవరం' చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్ పై.లి. బ్యానర్పై నిర్మితమవుతున్న రెండో చిత్రమిది.
నిర్మాణంలో న్యూ ఏజ్ సినిమా, తిరు కుమరన్ ఎంటర్టైన్మెంట్స్ అసోసియేట్ అవుతున్నారు. ఈ సినిమా మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.