శర్వానంద్ 'పడి పడి లేచే మనసు' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Tuesday,March 06 2018]

మోస్ట్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "పడి పడి లేచే మనసు". శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా నేడు (మార్చి 6) విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి మాట్లాడుతూ.. "'పడి పడి లేచే మనసు' ఒక డిఫరెంట్ & క్రియేటివ్ లవ్ స్టోరీ. నేడు మా హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా మా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం కలకత్తాలో హీరో శర్వానంద్, హీరోయిన్ సాయిపల్లవి, మురళీశర్మల కాంబినేషన్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. వెంకట్ మాస్టర్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నాం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, జయకృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది" అన్నారు.

శర్వానంద్, సాయిపల్లవి, మురళీశర్మ, ప్రియారామన్, వెన్నెల కిషోర్, కళ్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, ఫైట్స్: వెంకట్, అంబు-అరివ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం" జయకృష్ణ గుమ్మడి, నిర్మాణం: శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి, దర్శకత్వం: హను రాఘవపూడి.

More News

మ‌రో కొత్త ద‌ర్శ‌కుడితో క‌ళ్యాణ్ రామ్‌

గత రెండు సంవత్సరాల నుంచి నెమ్మదిగా సాగిన కెరీర్‌ను ప్రస్తుతం పరుగులు పెట్టిస్తున్నారు నందమూరి వారి కథానాయకుడు కళ్యాణ్ రామ్.

రానా కొత్త చిత్రం అప్‌డేట్‌

భూస్వాముల ధ‌నాన్ని కొల్లగొట్టి.. పేదలకు పంచిపెట్టే కథే రాబిన్ హుడ్ స్టోరీ. ఇటువంటి రాబిన్ హుడ్ కథతో యువ క‌థానాయ‌కుడు రానా ఓ సినిమా చేయ‌నున్నారు.

ఆది కొత్త చిత్రానికి ముహుర్తం కుదిరింది

'ప్రేమ కావాలి', 'లవ్లీ' సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు ఆది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. 'వినాయకుడు', 'విలేజీలో వినాయకుడు', 'కేరింత' సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అడివి సాయికిరణ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయ‌నున్నారు.

రామ్ కు సెకండ్ హీరోయిన్ దొరికిందా?

యువ కథానాయకుడు రామ్,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో

రాజకీయ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా

సంచలన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి'తో దక్షిణాది పరిశ్రమలోనే హాట్ టాపిక్ గా మారిపోయారు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.