close
Choose your channels

మదనపల్లె ఘటన: అలేఖ్యను చంపి ఆమె నాలుకను తినేసిందట..

Saturday, January 30, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసులో ఈ దారుణాలకు ప్రధాన కారణం పెద్ద కుమార్తె అలేఖ్యేనని తెలుస్తోంది. ఆమె మాటలను గుడ్డిగా నమ్మిన తల్లిదండ్రులు ఆమె చెప్పిన ప్రకారమే నడుచుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో తాజాగా ఓ సంచలన విషయం వెలుగు చూసింది. విచారణలో భాగంగా పురుష్తోత్తం నాయుడు పలు విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన విషయాల్లో షాకింగ్ విషయం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. పద్మజ గురంచి ఓ సంచలన విషయాన్ని పురుషోత్తం నాయుడు విచారణలో బయటపెట్టినట్టు తెలుస్తోంది.

తానే కాళికని భావిస్తూ వచ్చిన పద్మజ.. అలేఖ్యను చంపిన అనంతరం ఆమె నాలుకను కోసి తిన్నదని పురుషోత్తం నాయుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నిజమెంత అనేది పోస్టుమార్టం రిపోర్టులో తెలియనుంది. కాగా.. నిన్న నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం మదనపల్లి జైలు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తైన అనంతరం రాత్రి తరిగి మదనపల్లి సబ్ జైలుకు తీసుకెళ్లారు. విశాఖపట్టణంలో వారికి పూర్తి స్థాయిలో మానసిక వైద్యం చేయాలని రుయా ఆసుపత్రి వైద్యులు నిర్ధారించినట్టు తెలుస్తోంది.

అలేఖ్య భోపాల్‌‌లో చదువుతున్న సమయంలో..

కాగా.. అలేఖ్య భోపాల్‌లో చదువుతున్న సమయంలో ప్రభోదకుల ప్రసంగాలకు ఆకర్షితురాలైనట్టు తెలుస్తోంది. ఎక్కువగా వారి రచనలను చదువుతూ బాగా ప్రభావితురాలైనట్టు సమాచారం. ఈ క్రమంలో తనకున్న విశ్వాసాలను తల్లిదండ్రుల్లోనూ పెంచి పోషించింది. తాను ఓ కుక్కను చంపి పునర్జన్మను ప్రసాదించానని తల్లిదండ్రులను నమ్మించింది. చెల్లి చనిపోతానంటే ఆమెను ప్రోత్సహించింది. తల్లిదండ్రులు కూడా అలేఖ్య మైకంలో ఉండటంతో వారు కూడా సాయపడ్డారు. ఆ తరువాత తనను కూడా హత్య చేయాలని చెల్లి ఆత్మను తిరిగి తీసుకొస్తానని చెప్పడంతో అలేఖ్య చెప్పినట్టుగా తల్లిదండ్రులు చేసినట్టు తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.