అజిత్ను క్రాస్ చేసిన సూర్య
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'ఎన్.జి.కె(నందగోపాలకృష్ణ)'. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాతంర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయంటూ వార్తలు వినపడుతున్నాయి.
సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా స్టార్టయ్యింది. అందులో భాగంగా ఓవర్సీస్లో తెలుగు, తమిళ హక్కులు రెండుకోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయట. ఈ మధ్య తమిళంలో ఘన విజయం సాధించిన అజిత్ 'విశ్వాసం' కంటే ఈ రేటు ఎక్కువేనని వార్తలు వినపడుతున్నాయి. ఈరకంగా అజిత్ను సూర్య క్రాస్ చేశాడని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.