close
Choose your channels

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

Thursday, June 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 4069 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 891 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 719 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 10,444కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 137 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4361కి చేరుకుంది. 5858 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.

నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 225కు చేరుకుంది. కాగా రంగారెడ్డి జిల్లాలో నిన్న ఒక్కరోజే 86 కేసులు నమోదవగా.. మేడ్చల్ 55, సంగారెడ్డి 2, వరంగల్ రూరల్ 3, కరీంనగర్ 2, ఖమ్మం 4, భద్రాద్రి కొత్తగూడెం 6, నల్గొండ 2, సిద్దిపేట్, కామారెడ్డి, సిరిసిల్ల, గద్వాల్, సూర్యాపేట్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.