close
Choose your channels

తమ్ముళ్లూ.. బాబు భజన ఆపండి : త్రిమూర్తులు వార్నింగ్

Wednesday, June 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమ్ముళ్లూ.. బాబు భజన ఆపండి : త్రిమూర్తులు వార్నింగ్

ఇదేంటి.. తెలుగు తమ్ముళ్లకే టీడీపీ సీనియర్ నేత వార్నింగ్ ఇచ్చారని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. ఈ మాటలు విన్న సదురు టీడీపీ నేతలు కంగుతిన్న ఆలోచనలో పడ్డారట. ఇంతకీ షాకింగ్ కామెంట్స్ చేసిందెవరో కాదండోయ్.. టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు. అసలు ఆయన ఎందుకిలా అన్నారో..? ఎవర్ని ఉద్దేశించి అన్నారో అన్నది ఇప్పుడు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా పార్టీ కి నేతలు షాకిస్తుండటం.. టీడీపీ కోరిన ప్రజావేదికను అక్రమంగా నిర్మించిందని ప్రభుత్వం కుప్పకూల్చిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతుండటం.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు భజన చేస్తూ కొందరు నేతలు పబ్బం గడిపేస్తున్నారు. ఈ ప్రజావేదిక వ్యవహారంపై తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టారు.

బుద్ధా జర తగ్గు!?

పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసమే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో పాటు పలువురు నేతలు ఆందోళనకు దిగుతున్నారని త్రిమూర్తులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇకనైనా పార్టీ అధినేతకు భజన చేయడాన్ని టీడీపీ నేతలు మానుకోవాలని హితవుతో పాటు ఒకింత వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు మారకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. కాగా.. చంద్రబాబుపైన లేదా.. టీడీపీ విమర్శలు గుప్పిస్తే చాలు.. మొట్ట మొదట ప్రెస్‌మీట్ వ్యక్తి బుద్ధా వెంకన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే బుద్దాపై పరోక్షంగా కాస్త తగ్గించుకుని.. భజన మానమని త్రిమూర్తులు సెటైర్లు కురిపించారన్న మాట.

ప్రజావేదిక విషయంలో ఆందోళన నిర్వహిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని.. కరకట్టపై ఉన్న ఇతర అక్రమ నిర్మాణాల విషయంలో కూడా సీఎం జగన్ ఇలాగే స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా.. తోట త్రిమూర్తులుతో పాటు పలువురు కాపు నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ లేదా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీలో మరింత కాకరేపుతున్నాయి. సో.. త్రిమూర్తులు ఫ్యూచర్ ప్లానేంటి..? అనేది తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.