close
Choose your channels

అమెరికాలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి హత్య..

Wednesday, December 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమెరికాలో ప్రముఖ ఎన్ఆర్ఐ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ అధికార ప్రతినిధిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన దేవేందర్ రెడ్డి అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నారు. ఆయనను మంగళవారం న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్‌లో హత్య చేశారు. అయితే దేవేందర్ రెడ్డి హత్యకు గల కారణాలను పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో ఆయన హత్యపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

దేవేందర్ రెడ్డి హత్యపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దేవేందర్ రెడ్డి తన కారులో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుండగా.. ఆయనను హత్య చేశారని కొందరు చెబుతుండగా... ఓ బాంబు పేలుడు ద్వారా ఈ హత్య చేశారని కొందరు.. అగ్ని ప్రమాదం కారణం మరణించాడని కొందరు చెబుతున్నారు. అసలు కారణం మాత్రం తెలియరావడం లేదు. అయితే దేవేందర్ రెడ్డి కూర్చున్న కారుకి సంబంధించిన ఫొటో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ కారు విండో షీల్డ్స్ ఎవరో పగలగొట్టినట్లు ఉంది. ఫోటోను బట్టి చూస్తే అక్కడేదో పేలుడు జరిగినట్లే కనిపిస్తోంది. కాగా.. దేవేందర్ రెడ్డి అమెరికాలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తుంటారని తెలుస్తోంది. దేవేందర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.