close
Choose your channels

పెళ్లి కాని ప్రసాద్ కథతో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటోన్న 'అశోకవనంలో అర్జున కళ్యాణం' టీజర్

Wednesday, February 2, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పెళ్లి కాని ప్రసాద్ కథతో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటోన్న అశోకవనంలో అర్జున కళ్యాణం టీజర్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల విషయంలో దూకుడు పెంచారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్ ప్రస్తుతం.. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో అర్జున్ అనే వడ్డీ వ్యాపారిగా కనిపించనున్నారాయన. మార్చి 4న ఈ సినిమాను విడుదల తేదీని తెలియజేస్తూ.. ఈరోజు చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.

పెళ్లి కాని ప్రసాద్ కథతో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటోన్న అశోకవనంలో అర్జున కళ్యాణం టీజర్

"అరే... ఇంటర్ క్యాస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్.. సినిమాల్లో అయినా అయితదారా? నీకే ఫస్టా?" అని డైలాగ్‌తో టీజర్ ప్రారంభమయ్యింది. 'ఇప్పటివరకూ ఎన్ని సంబంధాలు చూశారు?' అని హీరోయిన్ పక్కనున్న అమ్మాయి అడిగితే... 'లెక్క పెట్టలేదు' అని హీరో చెప్పడం... 'అయితే పెద్ద నంబరే' అని ఆ అమ్మాయి కౌంటర్ ఇవ్వడం బాగుంది. 'గోదావరి అల్లుడు గారు పెళ్లికి ముందే పిల్ల చుట్టూ... అయ్ అయ్' , 'తాగితే గానీ మా బతుకులకు ఏడుపు రాదు. తాగినోడి ఏడుపుకి ఏమో వాల్యూ లేదు' అని డైలాగులు బాగున్నాయి.

పెళ్లి కాని ప్రసాద్ కథతో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటోన్న అశోకవనంలో అర్జున కళ్యాణం టీజర్

30 ఏళ్లు వచ్చినా... పెళ్లికాకపోవడంతో ఓ అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. అతనికి చివరికి పెళ్లి ఎలా కుదిరింది అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' కథకికి సంబంధించి హీరో విశ్వక్ సేన్ అల్రెడీ హింట్ ఇచ్చేశాడు. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు విశ్వక్ సేన్. 'ఇంకా రెండు రోజులే ఉంది.. పిల్లని వెతికి పెట్టండి లేదా కనీసం పడేయటానికి టిప్స్‌ అయినా ఇవ్వండి. వయసు 30 దాటింది. పొట్ట, జుట్టు.. చాలా కష్టాలున్నాయి' అంటూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీనిని బట్టే ఇది పెళ్లి కాని ప్రసాదు కథ అని అర్థమైపోయింది. తాజాగా టీజర్‌లో పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జై క్రిష్ సంగీతం అందించిన ఈ సినిమాకు 'రాజావారు రాణీగారు' ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.