close
Choose your channels

రాహుల్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కుట్ర జరిగిందా!?

Friday, April 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి పాట్నాకు ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పాట్నాకు వెళ్లకుండా ఢిల్లీకి విమానం వెనక్కి వచ్చింది.

ఇంజన్‌లో లోపం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ బీహార్, ఒరిస్సాల్లో జరిగే బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉంది. సభకు రావడానికి ఆలస్యమవుతుందని రాహుల్ అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

అసలేం జరిగింది..!?

ఇదిలా ఉంటే.. రాహుల్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఆ విమానంలో సమస్య తలెత్తిన సమయంలో ఇద్దరు సిబ్బంది సహా 12 మంది విమానంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్టు డీజీసీఏ ప్రకటించింది. ఇదిలా ఉంటే గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంలోనూ రాహుల్‌కి ఇలాంటి ఘటనే ఎదురైంది..

తాజాగా కూడా ఇలాంటి ఘటనే ఎదురవ్వడంతో ఈ మొత్తం వ్యవహారంలో ఏదో కుట్ర దాగుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు స్పందించిన డీజీసీఏ అధికారులు.. ఎలాంటి కుట్రలేదని.. ప్రమాదం చాలా చిన్నదేనని స్పష్టం చేయడం గమనార్హం. అయితే విచారణలో అధికారులు ఏం తేలుస్తారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.