close
Choose your channels

YSRCP: ఏపీలో వైసీపీ సునామీ ఖాయం.. ప్రముఖ జాతీయ సర్వేలో స్పష్టం..

Friday, April 5, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో వైసీపీ సునామీ ఖాయం.. ప్రముఖ జాతీయ సర్వేలో స్పష్టం..

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అయితే చాలా సంస్థలు చేసిన సర్వేల్లో అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెబుతున్నాయి. తాజాగా మరో సర్వేలోనూ వైసీపీ ప్రభంజనం కొనసాగనుందని తేలింది.

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీనే అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 21-22 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక టీడీపీ కూటమికి 3-4 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఏపీలో వైసీపీ హవా మరోసారి కొనసాగనుందని స్పష్టంచేసింది.

ఏపీలో వైసీపీ సునామీ ఖాయం.. ప్రముఖ జాతీయ సర్వేలో స్పష్టం..

అటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 8-10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. బీజేపీకి 4-6 ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1-3 ఎంపీ స్థానాలు దక్కుతాయని చెప్పుకొచ్చింది. అటు కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి 21-23 సీట్లు, కాంగ్రెస్ పార్టీ కేవలం 4-6 స్థానాలకు పరిమితం కావచ్చంది. ఇక జేడీఎస్ 1-2 లోక్‌సభ స్థానాలు గెల్చుకోవచ్చని అభిప్రాయపడింది.

ఇక 39 లోక్‌సభ స్థానాలున్న తమిళనాడులో అధికార డీఎంకే 21-22 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 5-7 సీట్లు గెల్చుకోవచ్చని వెల్లడైంది. గత ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ ఈసారి అనూహ్యంగా 2-6 స్థానాలు సాధించవచ్చని పేర్కొంది. ఏఐఏడీఎంకేకు 1-3 స్థానాలు లభించనున్నాయని.. ఇతరులు మరో 4-5 స్థానాలు గెలవవచ్చని చెప్పుకొచ్చింది. అలాగే కేరళలో కాంగ్రెస్ పార్టీ 8-10 స్థానాలు, సీపీఎం 6-8 సీట్లు, ఐయూఎంఎల్ 1-2 స్థానాలు గెలిచే పరిస్థితులున్నాయని అంచనా వేసింది. ఇతరులు మరో 1-2 స్థానాలు సాధించవచ్చని వెల్లడించింది.

మొత్తంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని టైమ్స్‌నౌ సర్వే వివరించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతలుగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణలో నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది. మొత్తం ఏడు విడతల ఫలితాలను జూన్ 4న ప్రకటించనున్నారు.

ఏపీలో వైసీపీ సునామీ ఖాయం.. ప్రముఖ జాతీయ సర్వేలో స్పష్టం..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.